Biden: ప్రాణనష్టం తప్పక పోవచ్చు.. కష్టమైనా కాబుల్ నుంచి ప్రజలను తరలిస్తాం: బైడెన్
కాబుల్ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని,
మా బలగాలను ప్రమాదంలోకి నెట్టి మరీ ఈ ప్రక్రియ చేపడుతున్నాం
చేపట్టిన పని పూర్తికాకుండా అఫ్గాన్ను విడిచేది లేదు
వాషింగ్టన్: కాబుల్ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని, ప్రాణనష్టం లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయినప్పటికీ, తాలిబన్ ఆక్రమిత అఫ్గాన్ నుంచి అమెరికన్లను, మిత్రదేశాల వారిని తరలిస్తామని అభయమిచ్చారు. అఫ్గానిస్థాన్ నుంచి ఈనెల 31లోగా తన బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్దేశించుకుంది. జులై నుంచి ఇప్పటివరకూ 18 వేల మందిని తరలించింది. తాలిబన్లు కాబుల్ను ఆక్రమించినా, అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ఇప్పటికీ అమెరికా బలగాల స్వాధీనంలోనే ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో, అమెరికా, మిత్రదేశాల వారూ... విదేశీ బలగాలతో కలిసి పనిచేసిన అఫ్గాన్లు భారీగా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అయితే, ధ్రువపత్రాల పరిశీలన జాప్యం కావడంతో తరలింపు ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ విషయంలో అమెరికా తీరు పట్ల విమర్శలు రావడంతో బైడెన్ శనివారం శ్వేతసౌధం వద్ద మాట్లాడారు.
‘‘అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కాబుల్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించే సామర్థ్యం ఈ ప్రపంచంలో ఒక్క అమెరికాకే ఉంది. మా పౌరులతోపాటు మిత్రదేశాలకు చెందిన సుమారు 65 వేల మందిని కూడా తరలిస్తాం. అయితే, ముందు అమెరికన్లకు ప్రాధాన్యమిస్తాం. చాలా సమస్యాత్మక పరిస్థితుల్లో, మా సాయుధ బలగాలను ప్రమాదంలోకి నెట్టి మరీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు
సాధ్యమైనన్ని వనరులను రంగంలోకి దించుతాం. ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సి ఉంది. అయినా నష్టం తప్పకపోవచ్చు!
విదేశీ విమానాలకూ వెసులుబాటు...
కాబుల్ విమానాశ్రయంలో సుమారు 6 వేల మంది అమెరికన్ బలగాలు భద్రత కల్పిస్తున్నాయి. అక్కడి నుంచి కేవలం సైనిక విమానాలే కాకుండా, విదేశాలకు చెందిన పౌరరవాణా విమానాలు కూడా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అఫ్గాన్ మహిళా నేతలు, పాత్రికేయులు సహా అమెరికా జర్నలిస్టులను సైనిక విమానాల్లో తరలించాం. మేం చేపట్టిన పని పూర్తికాకుండా అఫ్గాన్ను విడిచివెళ్లే ప్రసక్తే లేదు’’ అని బైడెన్ పేర్కొన్నారు.
ఓ వైపు ఆకలిదప్పులు.. మరోవైపు ఉత్కంఠ
బైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం కాబుల్ విమానాశ్రయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ‘ఎప్పుడెప్పుడు తమను తరలిస్తారా!’ అన్న ఆత్రుత, ఉత్కంఠ వేల మంది మోముల్లో కనిపించాయి. వీరందరికీ ఆకలిదప్పులు తప్పడంలేదు. విమానాశ్రయంలో తాగునీటికి కటకట నెలకొంది!
భారత్ ప్రభావం తగ్గించడానికే..
అఫ్గాన్లో పాక్ వ్యూహాలు అమెరికా నిఘా వర్గాల నివేదిక
అఫ్గానిస్థాన్పై భారత్ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) ఇచ్చిన సమాచారాన్ని అమెరికా విదేశాంగశాఖ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. ‘‘అఫ్గాన్ అంతర్యుద్ధ ఫలితంగా పాకిస్థాన్ వ్యతిరేక తీవ్రవాదులు బలపడొచ్చని, శరణార్థులు పెద్ద సంఖ్యలో తమ భూభాగంలోకి ప్రవేశించవచ్చని, తద్వారా దేశంలో అస్థిరత ఏర్పడవచ్చని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. అఫ్గాన్పై భారత్ ప్రభావం తగ్గించే విధంగా తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, శాంతి చర్చలకు మద్దతివ్వాలని భావిస్తోంది. మునుపటితో పోల్చితే, తాలిబన్లకు పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక సహకారం పెరిగింది. ఒకప్పుడు మసీదుల నుంచి వసూళ్లకు పాల్పడిన తాలిబన్లు... ఇప్పుడు సరిహద్దు నగరాలు, పట్టణాల్లో యథేఛ్ఛగా వసూలు చేస్తున్నారు. ఒక్కో దుకాణం నుంచి 50 డాలర్ల వరకూ అందుతున్నాయి.అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణను ఇరాన్ స్వాగతించినా, ఆ దేశంలో తాలిబన్ పాలనను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’’ అని నిఘా వర్గాలు విశ్లేషించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!