Booster Dose: 8 నెలల తర్వాత బూస్టర్ డోసు..?
రెండో డోసు తీసుకున్న 8 నెలల తర్వాత బూస్టర్ డోసు అందించాలని అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు అక్కడి నిపుణులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్న నిపుణులు
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వాటిలో రెండు డోసుల్లో తీసుకునేవే ఎక్కువగా ఉన్నాయి. వీటి నుంచి వృద్ధి చెందే యాంటీబాడీలు కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ నుంచి ఎక్కువ కాలం రక్షణ పొందేందుకు బూస్టర్ డోసును ఇవ్వాలని అమెరికా నిపుణులు భావిస్తున్నారు. వీటిపై అధ్యయనం జరిపిన నిపుణులు.. రెండో డోసు తీసుకున్న 8 నెలల తర్వాత బూస్టర్ డోసు అందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ కొత్త రకాలు వెలుగు చూస్తోన్న వేళ.. వాటిని నిరోధించేందుకు బూస్టర్ డోసుల అవసరంపై అమెరికా నిపుణులు అధ్యయనాలు చేపడుతున్నారు. ముఖ్యంగా డెల్టా వేరియంట్ వంటి రకాలు వస్తుండడంతో బూస్టర్ డోసును అనివార్యంగా భావిస్తున్నారు. ఇందుకోసం వ్యాక్సిన్ తీసుకున్న ఏడు, ఎనిమిది నెలల తర్వాత వాటి నుంచి రక్షణ తగ్గుతున్నట్లు ఇజ్రాయెల్ వంటి దేశాల్లో నమోదవుతున్న కేసుల విశ్లేషణను బట్టి ఓ అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నుంచి మరింత రక్షణ కల్పించేందుకు బూస్టర్ డోసు అవసరముందని అక్కడి జాతీయ ఆరోగ్య కేంద్రం (NIH) డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ కల్లిన్స్ పేర్కొన్నారు. దీనిపై ఈ వారంలోనే ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, ఫైజర్ వంటి సంస్థలు తయారు చేసిన బూస్టర్ డోసుల వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ సంస్థ (FDA) ఆమోదం తెలపాల్సి ఉందన్నారు.
ఇక బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియను ఇజ్రాయెల్ ఇప్పటికే మొదలుపెట్టింది. తొలివిడతలో 60ఏళ్ల వయసుపైబడిన వారికి.. రెండో డోసు తీసుకున్న ఐదు నెలల తర్వాత బూస్టర్ డోసు అందిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఒకవేళ బూస్టర్ డోసు పంపిణీ చేపట్టాల్సి వస్తే ముందస్తుగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, నర్సింగ్ హోంలలో ఉంటున్న వారితో పాటు వృద్ధులకు అందించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అమెరికాలో దాదాపు 19.8కోట్ల మంది కనీసం ఒకడోసు వ్యాక్సిన్ తీసుకోగా.. 16కోట్ల మంది రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్నట్లు అమెరికా సీడీసీ (CDC) వెల్లడించింది. అయితే, అమెరికా వంటి సంపన్న దేశాలు బూస్టర్ డోసుకోసం సన్నాహాలు చేస్తున్న వేళ.. అసలు తొలి డోసు లభించని పేద దేశాల గురించి ఆలోచించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక