COVID-19 Pill: కరోనా మాత్ర వినియోగానికి సానుకూలంగా అమెరికా!
అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘మెర్క్’ రూపొందించిన కొవిడ్ ఔషధం ‘మోల్నూపిరవిర్’ వినియోగంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ)కు చెందిన ఆరోగ్య సలహాదారుల కమిటీ సానుకూలంగా స్పందించింది......
వాషింగ్టన్: అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘మెర్క్’ రూపొందించిన కొవిడ్ ఔషధం ‘మోల్నూపిరవిర్’ వినియోగంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ)కు చెందిన ఆరోగ్య సలహాదారుల కమిటీ సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ ఔషధం త్వరలోనే అమెరికా పౌరులు వినియోగించేందుకు మార్గం సుగమం కానుంది. గర్భాధారణ సమయంలో ఈ ఔషధాన్ని వినియోగిస్తే.. శిశువులకు పుట్టుకతో వచ్చే ఎలాంటి లోపాలు రావని, వివిధ ముప్పులను అధిగమిస్తుందని కమిటీలోని 13-10 మంది ఓటు వేశారు. ఈ మాత్ర ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగిన తర్వాత ఈ మేరకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ఔషధాన్ని గర్భిణులు ఉపయోగించే విషయంపై దృష్టిసారించాలని ఎఫ్డీఏకు కమిటీ సూచించింది.
ఆస్తమా, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారితోపాటు అత్యధిక ముప్పును ఎదుర్కొనే వయోజనులు ఈ ఔషధం ఉపయోగించవచ్చని కమిటీ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చా? వద్దా? అన్నదానిపై పరిశోధన కొనసాగుతున్న నేపథ్యంలో.. వారు ఈ మాత్రను వినియోగించకూడదని కమిటీలో చాలా మంది సభ్యులు పేర్కొన్నారు. మోల్నూపిరవిర్ మాత్రపై ప్యానెల్ చేసిన సూచనలపై ఎఫ్డీఏ పూర్తిగా ఆధారపడదని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ఔషధ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపే విషయంపై సొంతంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
కరోనాను ఎదుర్కోవడంలో మోల్నుపిరవిర్ సమర్థంగా పని చేస్తుందని పరిశోధనల్లో తేలింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కోగలదా? లేదా? అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఒమిక్రాన్పై ఈ పిల్ సామర్థ్యాన్ని ఇంకా పరిశీలించనప్పటికీ.. కొంతమేర ప్రభావవంతంగానే పనిచేస్తుందని వారు భావిస్తున్నారు. ‘కరోనా కొత్త వేరియంట్లను మోల్నుపిరవిర్ ఎదుర్కొంటుందనడానికి ఆధారం లేదు. దీని గురించి ప్రకటించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని చార్లెస్ డ్రూ యూనివర్సిటీ స్కూల్ మెడిసిన్ అండ్ సైన్సెస్కు చెందిన డాక్టర్ డేవిడ్ హార్డీ అభిప్రాయపడ్డారు. ఎఫ్డీఏ ఆరోగ్య నిపుణుల కమిటీలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్