Rajasthan: మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైన రాజస్థాన్ సీఎం.. పైలట్​ వర్గానికి చోటు

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ఎట్టకేలకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు. పార్టీ హైకమాండ్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ వర్గానికి.....

Published : 21 Nov 2021 01:12 IST

జైపుర్‌: రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ ఎట్టకేలకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు. పార్టీ హైకమాండ్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ వర్గానికి ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ పార్టీ అధినేత్రి సోనియాను కలిసి మాట్లాడారు. రాజస్థాన్‌ కేబినెట్‌లో ప్రస్తుతం సీఎం గహ్లోత్‌ సహా 21 మంది మంత్రులు ఉన్నారు. శాసనసభలో ఉన్న 200 మంది సభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో గరిష్ఠంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది.

రాజస్థాన్‌ గవర్నర్‌ నివాసంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌, సీఎం అశోక్‌ గెహ్లోత్‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాకు సిద్ధపడిన ముగ్గురు మంత్రుల వ్యవహారంపై మంత్రిమండలి చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెవెన్యూ మంత్రి హరీష్‌ చౌదరీ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ, విద్యాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌లు కేబినెట్‌ నుంచి తప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మంత్రి గోవింద్‌ సింగ్‌ రాజస్థాన్ పీసీసీ అధ్యక్షునిగా ఉండగా.. మిగితా ఇద్దరిలో డాక్టర్‌ రఘుశర్మ, హరీష్‌ చౌదరీలు గుజరాత్‌, పంజాబ్‌ పార్టీ వ్యవహారాల బాధ్యులుగా నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని