Omicron: భేష్.. దక్షిణాఫ్రికా! ప్రపంచానికి ఆదర్శంగా నిలిచావ్: అమెరికా
దక్షిణాఫ్రికాపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు కురిపించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వెలుగుచూసిన విషయం తెలిసిందే. కాగా, ఆ దేశం కొత్త వేరియంట్ను గుర్తించి.. వెంటనే ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వడం గొప్ప విషయమని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. శనివారం
వాషింగ్టన్: దక్షిణాఫ్రికాపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు కురిపించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వెలుగుచూసిన విషయం తెలిసిందే. కాగా, ఆ దేశం కొత్త వేరియంట్ను గుర్తించి.. వెంటనే ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వడం గొప్ప విషయమని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. శనివారం ఆయన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెడి పాండొర్తో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికాలో వ్యాక్సికేషన్ ప్రక్రియపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా కొత్త వేరియంట్ను త్వరితగతిన గుర్తించిన శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమాచారాన్ని పంచుకోవడంలో పారదర్శకత ప్రదర్శించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ మొదట చైనాలో 2019 డిసెంబర్లో బయటపడింది. అయితే.. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం ఆలస్యంగా ప్రపంచానికి వెల్లడించింది. దీంతో ప్రపంచదేశాలన్నీ కరోనా పంజాకి విలవిలలాడిపోయాయి. ఈ నేపథ్యంలోనే కరోనా సృష్టికి.. అనంతర పరిణామాలకు చైనానే కారణమని అమెరికా తీవ్రంగా విమర్శిస్తూ వస్తోంది. కరోనా వ్యాప్తి గురించి కీలకమైన సమాచారాన్ని పంచుకోవడంలో చైనా తాత్సార్యం చేసిందని ఆరోపించింది. ఆ దేశం కరోనా విషయంలో మరింత పారదర్శకంగా ఉండి ఉంటే.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వీలుండేదని అభిప్రాయపడింది. కరోనా మూలాలు ఆన్వేషించేందుకు అమెరికా ప్రయత్నించగా.. దీనికి చైనా సహకరించలేదు. ఈ క్రమంలో అమెరికా-చైనా మధ్య వైరం పెరిగింది. దీంతో గత కొంత కాలంగా ఇరు దేశాలు.. వాణిజ్యం, మానవ హక్కులు, తైవాన్కు సంబంధించిన విషయంలో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?