Akshay Kumar: రూ.7 కోట్ల విలువైన ఫ్లాట్‌ కొన్న అక్షయ్‌.. విశేషాలివే!

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ముంబయిలో మరో విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.

Published : 24 Jan 2022 20:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ముంబయిలో మరో విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. నగరంలోని స్వాంకీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఈ ఫ్లాట్‌ విలువ రూ.7.84 కోట్లు. తాజా కొనుగోలుతో ప్రస్తుతం ముంబయిలో ఉన్న అక్షయ్‌ ఆస్తుల  జాబితాలో కొత్తగా ఈ ఫ్లాట్‌ వచ్చి చేరింది. సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ డూప్లెక్స్‌లో భార్య ట్వింకిల్‌ ఖన్నాతో పాటు, పిల్లలు ఆరవ్‌, నితారలతో కలిసి అక్షయ్‌ నివసించనున్నారు.

అంతేకాదు, విలాసవంతమైన ఈ అపార్ట్‌మెంట్‌లో అక్షయ్‌కు సంబంధించిన నాలుగు కార్లను కూడా పార్క్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఇక రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్‌ ప్రకారం.. రెరా కార్పెట్‌ ఏరియా 1878 అడుగులతో కలిపి మొత్తం 200.58 చదరపు గజాలు (2155 చదరపు అడుగులు). దీంతో పాటు, డ్రై ఏరియా 29 అడుగులు, డక్ట్‌ ఏరియా మరో 55 చదరపు అడుగులు ఉంటుంది. అక్షయ్‌ ఈ అపార్ట్‌మెంట్‌లోని 19వ ఫ్లోర్‌లో ఉంటారు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న బిజీ నటుల్లో అక్షయ్‌ ఒకరు. ఇటీవలే ఆయన నటించిన ‘అత్రంగీరే’ ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం అక్షయ్‌ ‘పృథ్వీరాజ్‌’, ‘బచ్చన్‌పాండే’, ‘రక్షా బంధన్‌’, ‘రామసేతు’, ‘మిషన్‌ సిండ్రిల్లా’, ‘ఓ మైగాడ్‌2’, ‘గోర్కా’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని