Bollywood: కరోనా కష్టం.. బాలీవుడ్కు నష్టం
కరోనా చిత్రసీమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. తొలి, రెండో వేవ్ల్లో దాని విజృంభణకు భారీ నష్టాల్ని మూటగట్టుకుంది బాలీవుడ్ చిత్రసీమ. అయిందేదో అయిపోయింది ఈ ఏడాది బాగుంటుందన్న ఆశతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినా నిరాశే ఎదురైంది.
తొలి మూడు నెలల్లో రూ.1500కోట్లు
విడుదల వాయిదాలు... ఆగిన చిత్రీకరణలు
కరోనా చిత్రసీమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. తొలి, రెండో వేవ్ల్లో దాని విజృంభణకు భారీ నష్టాల్ని మూటగట్టుకుంది బాలీవుడ్ చిత్రసీమ. అయిందేదో అయిపోయింది ఈ ఏడాది బాగుంటుందన్న ఆశతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినా నిరాశే ఎదురైంది. మూడో వేవ్ దెబ్బకు మళ్లీ కథ మొదటికొచ్చింది. విడుదలలు వాయిదా వేయాల్సి వచ్చింది. షూటింగులు ఆగిపోయాయి. చాలా చోట్ల థియేటర్లు నడవడం లేదు. నడిచే చోట 50 ఆక్యుపెన్సీ. దీంతో పలు పాన్ ఇండియా స్థాయి సినిమాలతో పాటు భారీ బాలీవుడ్ చిత్రాల విడుదలా ఆగిపోయింది. దీంతో బాలీవుడ్కు తీవ్ర నష్టం తప్పట్లేదు.
కరోనా మూడోవేవ్ కారణంగా సినిమా విడుదలల వాయిదా, చిత్రీకరణ షెడ్యూల్స్ అన్నీ మారిపోవడంతో బాలీవుడ్ ఓ విధంగా స్తంభించిపోయింది. ‘జెర్సీ’ సినిమా వాయిదాతో కరోనా ప్రభావం చిత్రసీమ మీద మొదలైంది. షాహిద్కపూర్ కథానాయకుడిగా గౌతమ్తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇలా మొదలైన వాయిదాల పర్వం ‘ఆర్ఆర్ఆర్’తో రెట్టింపైంది. సినీవర్గాల్లో ఆందోళనా పెరిగిపోయింది. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ఇండియా స్థాయిలో క్రేజీ చిత్రంగా మారింది. ఆ తర్వాత ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అక్షయ్కుమార్ ‘పృథ్వీరాజ్’ వాయిదా పడటంతో బాలీవుడ్లో సందడే పోయింది. మార్చి వరకూ ఈ పరిస్థితి. అదే జరిగితే తక్కువలో తక్కువ రూ.1000కోట్లు పైగానే నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ‘‘2019 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి బాక్సాఫీసు లెక్కలు మారాయి. సంవత్సర లెక్కలు కాకుండా మూడు నెలల చొప్పున అంచనా వేస్తున్నాం. అలా చూసుకుంటే ఈ ఏడాది తొలి త్రైమాసికం దెబ్బతిన్నట్టే. దీని వల్ల చిత్ర నిర్మాణ రంగమే కాదు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ దెబ్బతింది’’అంటున్నారు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈవో శిభాషిస్ సర్కార్.
పండగను కోల్పోయాం
కీలకమైన పండగ సీజన్ బాలీవుడ్ని బాగా దెబ్బకొట్టిందనే ఆవేదన పరిశ్రమలో వ్యక్తం అవుతోంది. ‘‘బాక్సాఫీసు లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడాది తొలి త్రైమాసిక నష్టం రూ.1500కోట్లు. ఏడాది ప్రథమార్ధంలో కీలకమైన పండగ సీజన్ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఫిబ్రవరి, మార్చిల్లో పరిస్థితులు అనుకూలించేలా లేవు. దాంతో ఏప్రిల్ నుంచి పరిస్థితి గాడిన పడుతుందనే ఆశతో ఉన్నాం’’అంటున్నారు ట్రేడ్ విశ్లేషకుడు జోగిందర్.
చిత్రీకరణలు ఆగిపోయినా నష్టమే
భారీ చిత్రాల షూటింగులు నిలిచిపోవడమూ తీవ్ర నష్టమే అంటున్నారు నిర్మాతలు. ‘‘పెద్ద చిత్రాల నుంచి ఓ మాదిరి బడ్జెట్ చిత్రాల వరకూ షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా చాలా సన్నాహాలు జరుగుతాయి. దాని కోసం రూ.కోట్లలో వ్యయం అవుతుంది. అవుట్డోర్ షెడ్యూల్స్ అంటే మరింత ఖర్చు ఉంటుంది. కరోనా తీవ్రత పెరగడంతో షూటింగులు ఆగిపోతున్నాయి. దీంతో చేసిన వ్యయంలో చాలావరకూ వృథా అయిపోతుంది. మళ్లీ షెడ్యూల్ ప్లాన్ చేయాలంటే బడ్జెట్ పెరిగిపోతుంది. అంతే కాకుండా అనుకున్న సమయానికి విడుదల చేయలేని పరిస్థితి. సర్దుకుపోయి ఏదో ఒక తేదీకి విడుదల చేస్తే ఆశించిన వసూళ్లు రావు’’అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏప్రిల్ వరకూ థియేటర్ల పరిస్థితులు మారేలా కనిపించడం లేదు. మార్చి తొలివారం తర్వాత ఆశాజనకంగా మారి భారీ చిత్రాలు విడుదల మొదలై, చిత్రీకరణలైనా అనుకున్న ప్రకారం జరిగితే కొంతమేర నష్టాల నుంచి గట్టెక్కొచ్చు అంటున్నాయి సినీ వ్యాపార వర్గాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరతా.. సీఎంకు తెలిపిన భారాస ఎమ్మెల్యే!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్