F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varuntej), తమన్నా (Tamannaah), మెహ్రీన్ (Mehreen) ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ‘ఎఫ్-3’పై (F3) తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala krishna). ‘ఎఫ్-2’తో పోలిస్తే....
సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టిన రచయిత
హైదరాబాద్: వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varuntej), తమన్నా (Tamannaah), మెహ్రీన్ (Mehreen) ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ‘ఎఫ్-3’పై (F3) తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala krishna). ‘ఎఫ్-2’తో పోలిస్తే ‘ఎఫ్-3’ అంత బాలేదని ఆయన తెలిపారు. గతంలో తాము చేసిన తప్పే ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేశారా? అన్న అనుమానం తనకు కలిగిందని అన్నారు. ఈ మేరకు ‘ఎఫ్-3’పై తన మనసులోని మాట బయటపెడుతూ ‘పరుచూరి పలుకులు’ వేదికగా తాజాగా ఆయన వీడియో షేర్ చేశారు.
‘‘ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ఎఫ్-2’ చూసిన కళ్లతో ‘ఎఫ్-3’ చూస్తే ఈ సినిమా అంత బాలేదనిపించింది. కలెక్షన్స్ పరంగా చూసుకున్నా.. ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు రాలేదనే అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకూ ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒకవేళ ఇదే చిత్రం కనుక దాదాపు రూ.250 కోట్లు వసూళ్లు చేస్తే ‘ఎఫ్-2’తో సమానమై ఉండేది. ‘ఎఫ్-2’ అంత విజయం సాధించడానికి కారణం అది అందరికీ ఆసక్తి ఉన్న అంశం. భార్యాభర్తలిద్దరిలో ఎవరి పెత్తనం ఇంట్లో కొనసాగాలి? అనే టాపిక్పై ఆ చిత్రాన్ని రూపొందించారు. మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న గొడవలను చూపించారు. దానివల్ల ప్రతి ఒక్కరూ ‘ఎఫ్-2’కి కనెక్ట్ అయిపోయారు. అందుకే ఆ సినిమా అందరి హృదయాలకు చేరువైంది. అనిల్ రావిపూడికి మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. రైటర్, స్క్రీన్ప్లే, దర్శకుడిగా ఆయన విజయం సాధించాడు’’
‘‘ఇటీవల నేను ‘ఎఫ్-3’ చూశా. గతంలో ‘శ్రీ కట్న లీలలు’లో మేము చేసిన పొరపాటే అనిల్ రావిపూడి ఈ సినిమాలోని సెకండాఫ్లో చేశారనే అనుమానం నాకు కలిగింది. ప్రాథమికంగా చూసుకుంటే సెకండాఫ్కి వచ్చేసరికి కథ పట్టాలు తప్పింది. ఒక చీటింగ్ డ్రామాని దాదాపు 40 నిమిషాలు నడిపారు. చిన్నప్పుడు తప్పిపోయిన తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నానని, ఆ కొడుక్కి ఇప్పుడు సుమారు 20 ఏళ్లు ఉంటాయని మురళీ శర్మ ప్రకటించడం.. అది చూసి, డబ్బు కోసం తానే కొడుకునంటూ వెంకటేశ్ వెళ్లినట్టు సినిమాలో చూపించారు. వెంకీ వయసు మనందరికీ తెలుసు. ఆయన్ని ఇరవైయేళ్ల కొడుకు పాత్రలో చూపించడం అంతగా అతికినట్లు అనిపించలేదు. మేము వెంకీకి ఎన్నో సినిమాలు రాశాం. ఏ కాస్త లాజిక్ మిస్సైనా ఆయన అస్సలు ఒప్పుకోరు. అలాంటిది ఈ పాత్ర ఎలా ఓకే చేశారో అర్థం కావడం లేదు. అదే విధంగా తమన్నాకు మీసాలు పెట్టి ఒక అబ్బాయిలా చూపించడం, తాము కూడా కొడుకులమేనంటూ వెన్నెలకిషోర్, వరుణ్ తేజ్ అక్కడికి రావడం... ఇలా సెకండాఫ్లో వచ్చే సీన్స్ అన్నీ అర్థంపర్థం లేని కామెడీలా అనిపించాయి’’
‘‘సెకండాఫ్లోని 40 నిమిషాలు ఇలా కాకుండా వేరేలా చూపించి ఉండుంటే సినిమా మరోలా ఉండేదని నా భావన. సినిమా చివర్లో వరుణ్తేజే.. మురళీ శర్మ వారసుడని, వెంకీ, తమన్నా, రాజేంద్రప్రసాద్.. ఇతర పాత్రధారులందరూ చెబుతారు కదా. అదే సీన్ని మెయిన్ పాయింట్గా తీసుకుని వరుణ్ని మురళీ శర్మ వారసుడిగా నిరూపించేందుకు వాళ్లందరూ నానా తంటాలు పడుతున్నట్లు కనుక డ్రామా నడిపి ఉంటే బాగుండేదనిపించింది.’’
‘‘అలాగే డబ్బు ఉంటే సుఖంగా జీవించవచ్చు అనేది నిజం కాదు. ఇది ప్రాథమిక సూత్రం. కాబట్టి, డబ్బుంటేనే సంతోషంగా జీవించగలమని చూపించకుండా ఉండాల్సింది. సినిమా ప్రారంభంలో సునీల్ని కత్తితో పొడిచినట్లు చూపిస్తారు. కట్ చేస్తే ఫస్ట్ సాంగ్లో అతడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అదెలా సాధ్యం. తన కుటుంబం మొత్తం హోటల్ నడుపుకొంటూ ఉంటుంటే మెహ్రీన్ మాత్రం వేరే ఇంట్లో పనిమనిషిగా వర్క్ చేయడం కూడా అంతగా నప్పలేదు. ఎన్నో తప్పులున్నప్పటికీ ఈ సినిమా బతికిందంటే అది కేవలం చివరి 20 నిమిషాల వల్లే. హీరో అంటే ఏదైనా చేయగలడు అని నిరూపించాలి తప్ప.. అతడికి ఏం చేతకాదు అనిపించుకోకూడదు. చివరి 20 నిమిషాల్లో వరుణ్ తేజ్, వెంకటేశ్ పాత్రలను రియల్ హీరోలుగా దర్శకుడు చూపించాడు కాబట్టే ఆ సినిమా నిలబడిందని నా ఉద్దేశం. ఫైనల్గా ‘ఎఫ్-2’లో మాదిరిగా ఈ సినిమాలో మనసుని హత్తుకునే డ్రామా లేదు’’ అని పరుచూరి చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?