Amitabh Bachchan: ఈ షో కొనసాగుతుంది.. ప్రశాంతంగా ఉండండి: అమితాబ్
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరీనా కపూర్, జాన్ అబ్రహాం వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులకు వైరస్ సోకింది.
ముంబయి: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. పలువురు బాలీవుడ్ నటులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్కి చెందిన మంబయి నివాసంలో సిబ్బంది ఒకరు కరోనా బారినపడినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమితాబ్ ప్రేరణనింపే సందేశాన్ని తన బ్లాగ్లో పోస్టు చేశారు.
‘పోరాడు.. పోరాడండి.. మాట్లాడటానికేం లేదు.. ఈ షో కొనసాగుతుంది.. మనల్ని దయతో చూసే సర్వశక్తిమంతుడి చెంత ప్రశాంతంగా ఉండండి.. మనిషి అవమానకరంగా ప్రవర్తించినా.. మన్నించి, ధర్మమార్గంలో నడిచేలా దారిచూపుతాడు.. ఇంతవరకు గుర్తించని ఏదో తెలియని శక్తిని మనం అనుసరిస్తుంటాం.. ఆ శక్తి ఆవరించిన బుడగలో చివరి వరకు సురక్షితంగా ఉండండి’ అని కవితాత్మకంగా స్పందించారు. తాను కూడా కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తర్వాత ముచ్చటిస్తానని ముగించారు.
2020లో అమితాబ్ కుటుంబం కరోనాతో ఇబ్బంది పడింది. ఆయనతో పాటు కొడుకు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలికి వైరస్ సోకింది. తాజాగా ఆయన జల్సా నివాసంలో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిలో ఒకరికి పాజిటివ్గా తేలింది. ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం కొవిడ్ కేర్ సెంటర్కు తరలించినట్లు బీఎంసీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్