Bigg Boss Telugu 5: కేక్‌ తినేసిన సన్నీ.. యానీ మాస్టర్‌ ఫైర్‌

‘బిగ్‌బాస్‌ 5’ ప్రోమో.. ‘బిగ్‌బాస్‌’లో నవ్వులు విరబూశాయి.  సన్నీ కేక్‌ తినేసి కామెడీ పండించాడు. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కార్యక్రమం ఇది.

Published : 10 Nov 2021 13:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిగ్‌బాస్‌’లో నవ్వులు విరబూశాయి. సన్నీ కేక్‌ తినేసి కామెడీ పండించాడు. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కార్యక్రమం ఇది. ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఆ విశేషాలివీ..

కేక్‌ తినేందుకు అర్హులెవరని సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న జెస్సీని బిగ్‌బాస్‌ అడుగుతాడు. ఇదే సమయంలో అది నాకు కావాలంటే నాకు అంటూ హౌజ్‌మేట్స్‌ మధ్య చర్చ సాగింది. ‘మీరు తీసుకోకండి యానీ మాస్టర్‌.. అది నాకు కావాలి’ అని సన్నీ గట్టిగా చెప్తాడు. ఇదిలా ఉంటే ‘ఈ స్వీట్‌ తినే అర్హత నాకు ఉందనుకుంటున్నా. నేను తినొచ్చా’ అని యానీ మాస్టర్‌ బిగ్‌బాస్‌ని అడిగింది. అయితే తనకి నిరాశే ఎదురైంది. ఎవరి మాటల్నీ లెక్కచేయకుండా సన్నీ ఆ కేక్‌ను తినేశాడు. ‘నాకేమో ఆగదు. వెళ్లి తినేశా. ఇప్పుడు ఏం పంచాయతీ అవుతుందో ఏమో’ అని టెన్షన్‌ పడ్డాడు. సన్నీ హావభావాలు, మాటలు ఇంటి సభ్యులందరినీ నవ్వించాయి. ‘ప్రతిసారీ ఆయనే నమ్మకాన్ని బ్రేక్‌ చేశాడు’ అని యానీ మాస్టర్‌ సీరియస్‌ అయింది. మరి కేక్‌ తినేసిన సన్నీ పరిస్థితి ఏంటి? తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని