EMK: నీకన్నా గురువుగారే బెటర్‌.. ఎన్టీఆర్‌తో మహేశ్‌ సందడి

‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోమో.. ఎన్టీఆర్‌తో మహేశ్‌బాబు చేసిన సందడి చూసేయండి...

Updated : 14 Sep 2023 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటులు మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిస్తే ఎంతటి సందడి ఉంటుందో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ కార్యక్రమం చూపించింది. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఇది. సామాన్యుడిని కోటీశ్వరుడిగా మార్చే ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు తారలు విచ్చేసి ప్రేక్షకులకు వినోదం పంచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్‌బాబు పాల్గొని అంతకుమించి ఎంటర్‌టైన్‌ చేశారు. త్వరలోనే ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 39 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో కనుల పండగలా సాగింది. ఈ ఇద్దరు హీరోల సంభాషణలు విశేషంగా అలరించాయి. ‘సరైన సమాధానమే కదా... దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్‌ చేయడం ఎందుకు?’ అని మహేశ్‌బాబు అడిగితే ‘ఏదో సరదాగా’ అంటూ ఎన్టీఆర్‌ బదులిచ్చారు. ఆ వెంటనే ‘నీకన్నా గురువుగారే (కంప్యూటర్‌) బెటర్‌గా ఉన్నారు’ అని మహేశ్‌.. ఎన్టీఆర్‌తోపాటు షోలో ఉన్న వారందరినీ నవ్వించారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ కోసం అటు ఎన్టీఆర్‌ అభిమానులు, ఇటు మహేశ్‌బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకూ ప్రోమో చూసి ఆనందించండి..

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని