Gopichand Aaradugula Bullet Review: రివ్యూ: ఆరడుగుల బుల్లెట్
గోపీచంద్-నయనతార జంటగా నటించిన ఆరడుగుల బుల్లెట్ ఎలా ఉందంటే
చిత్రం: ఆరడుగుల బుల్లెట్; నటీనటులు: గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు తదితరులు; కథ,కథనం: వక్కంతం వంశీ; సంగీతం: మణిశర్మ; ఛాయాగ్రహణం: బాల మురుగన్; కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు; నిర్మాత: తాండ్ర రమేష్; దర్శకుడు: బి.గోపాల్; బ్యానర్: జయ బాలాజీ రియల్ మీడియా; విడుదల: 8 అక్టోబర్ 2021
ఏళ్ల తరబడి సెట్స్పై మగ్గే సినిమాలు కొన్ని ఉంటాయి. రకరకాల కారణాలతో ఎప్పుడో మొదలై, ఇంకెప్పుడో అవి ప్రేక్షకుల ముందుకొస్తాయి. అలాంటి చిత్రమే.. ‘ఆరడుగుల బుల్లెట్’. నాలుగేళ్లుగా పలుసార్లు విడుదల తేదీల్ని మార్చుకున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గోపీచంద్ కథానాయకుడు కావడం, బి.గోపాల్ దర్శకత్వం వహించడం, వక్కంతం వంశీ, అబ్బూరి రవి, మణిశర్మ తదితరులు ఈ సినిమాలో భాగం కావడంతో ఎంత ఆలస్యమైనా ఒకింత ఆసక్తిని రేకెత్తించింది. మరి చిత్రం ఎలా ఉందో చూద్దామా..
కథేంటంటే: నిజాయతీకి మారుపేరైన ఓ ప్రభుత్వ ఉద్యోగి మూర్తి (ప్రకాశ్రాజ్). అతడి కుమారుడే శివ (గోపీచంద్). కుటుంబంపై ప్రేమ తప్ప.. మిగతా బాధ్యతలేవీ పట్టని యువకుడు శివ. వయసొచ్చిన కొడుకు అలా ఏ పనీ లేకుండా తిరగడం తండ్రికి అస్సలు నచ్చదు. ఎంత చెప్పినా అతడిలో మార్పు రాదు సరికదా, నయనతో (నయనతార) ప్రేమలో పడతాడు. ఏం యోగ్యత ఉందని ప్రేమించావ్?అంటూ ప్రేయసి ముందే శివని అవమానిస్తాడు తండ్రి మూర్తి. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి పంపేస్తాడు. ఇంతలో కాశీ (అభిమన్యు సింగ్) అనే ఓ రౌడీ నుంచి మూర్తికి ముప్పు ఏర్పడుతుంది. అసలు వారిద్దరి మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది? తన తండ్రి సమస్యల్లో ఉన్నాడని తెలిశాక శివ స్పందన ఏమిటి? తనని వద్దనుకున్న కుటుంబం కోసం ఎలా పోరాటం చేశాడనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: ట్రెండ్ మాటెలా ఉన్నా.. అన్నీ అనుకున్నట్టు కుదిరాయంటే మాస్ సినిమాలకి బాక్సాఫీసు దగ్గర తిరుగుండదు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘క్రాక్’ వరకూ కూడా ఆ విషయాన్ని తరచూ ఏదో ఒక సినిమా నిరూపిస్తూనే ఉంది. కథానాయకులు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో కూడిన మాస్ కథలపై మొగ్గు చూపుతున్నారంటే కారణం కూడా అదే. మాస్ కథల్లో లాజిక్ల గురించి ప్రేక్షకుడు కూడా అంతగా పట్టించుకోడు. హీరోయిజం మోతాదు ఎంతున్నా, పాట తర్వాత ఫైటు, ఆ తర్వాత ఓ కామెడీ సీన్ వంటి లెక్కలతో సన్నివేశాలు సాగుతున్నా ప్రేక్షకుడు ఓకే చేసేస్తాడు. కాకపోతే కథో, కథానేపథ్యమో ఏదో ఒక విషయం కొత్తగా ఉండాలనుకుంటాడు. ఈ సినిమాలో మాత్రం అవేవీ కనిపించవు. కథ మొదలుకొని కామెడీ సన్నివేశాల వరకూ ప్రతిదీ.. ఎన్నో సినిమాల్లో చూశాం అన్నట్లుగానే ఉంటుంది.
తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. తండ్రి చీవాట్లు పెట్టడం, కొడుకు పడటం, పట్టించుకోకుండా తిరగడం, ఆ తర్వాత కథానాయికతో ప్రేమలో పడటం.. ఇలా సగటు తండ్రీ కొడుకుల సినిమాల్లాగే సాగుతుంది. అందులో కొత్తదనమేమీ లేదు. కథానాయకుడి తండ్రికి.. రౌడీ నుంచి సమస్య వచ్చినప్పుడే అసలు కథ మొదలైనట్టు అనిపిస్తుంది. కానీ, ఆ ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని బలంగా ఆవిష్కరించలేకపోయారు. ఆ రౌడీ పాత్రలో ఏమాత్రం బలం లేకపోవడంతో హీరోయిజం కూడా నీరుగారిపోయినట్టైంది. ప్రేమ సన్నివేశాల్లోనూ, కామెడీ ట్రాకుల్లోనూ కొత్తదనం లేదు. కుటుంబ నేపథ్యం అన్నప్పుడు భావోద్వేగాలు కీలకం. కానీ తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో భావోద్వేగాలు పండలేదు. కొద్దిలో కొద్దిగా గోపీచంద్ - నయనతార జోడీ, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. గోపీచంద్ చేసే పోరాటాలు, ఆయన కనిపించే తీరు కూడా మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే: గోపీచంద్కి అలవాటైన పాత్రే. ఇందులో ఆయన మరింత హుషారుగా కనిపిస్తాడు. అందంగా కూడా కనిపించాడు. పోరాట ఘట్టాలతోనూ అలరించాడు. నయనతార పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల కోసమే అన్నట్టుగా ఆమె పాత్ర సాగుతుంటుంది. పాటల్లోనూ, కొన్ని ప్రేమ సన్నివేశాల్లోనూ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అలరిస్తుంది. ప్రకాశ్రాజ్కి ఈ పాత్ర కొత్తదేమీ కాదు. తనదైన శైలిలో ప్రభావం చూపించారు. అభిమన్యు సింగ్ విలనిజంలో పసలేదు. ఆ పాత్ర లోపమే అది. హాస్యనటులు ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్రెడ్డి ఇందులో కనిపిస్తారు. ఎమ్మెస్ నారాయణ పాత్రకి మరొకరితో డబ్బింగ్ చెప్పించడంతో అది అంతగా అతకలేదు. బ్రహ్మానందం కాలం చెల్లిన కామెడీ సన్నివేశాల్లో కనిపిస్తారు. మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు. బలమైన సాంకేతిక బృందమే పనిచేసింది. వక్కంతం వంశీ కథలోనూ, కథనంలోనూ బలం లేదు. అబ్బూరి రవి మాటలు అక్కడక్కడా పర్వాలేదనిపిస్తాయి. మణిశర్మ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. బి.గోపాల్ మేకింగ్ కథకి తగ్గట్టే ఉంటుంది. కథల్ని ఎంచుకోవడంలోనూ, కథనాన్ని నడిపించడంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ తరం ప్రేక్షకుల్ని మెప్పించలేమనే విషయం ఆయనకి మరోమారు అర్థమయ్యేలా చేస్తుందీ చిత్రం.
బలాలు
+ గోపీచంద్ - నయనతార జోడీ
+ ప్రథమార్ధం
+ పోరాట ఘట్టాలు
బలహీనతలు
- రొటీన్గా సాగే కథ, కథనం
- భావోద్వేగాలు
చివరిగా: గురి తప్పిన బుల్లెట్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!