Pakka Commercial: ‘పక్కా కమర్షియల్’ విడుదల ఆరోజే .. మోహన్లాల్ ‘మరక్కర్’ థియేటర్లలోనే
గోపీచంద్, రాశిఖన్నా జంటగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని ఖరారు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: గోపీచంద్, రాశిఖన్నా జంటగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. చిత్ర బృందం విడుదల తేదీని తాజాగా ఖరారు చేసింది. 2022 మార్చి 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ని విడుదల చేసింది. ఈ సినిమాలో గోపీచంద్, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. జాక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు.
ఓటీటీలో కాదు..
మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మరక్కర్’. ‘అరేబియా సముద్ర సింహం’ అనేది ఉపశీర్షిక. అర్జున్, సుహాసిని కీర్తి సురేశ్, సునీల్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2020 మార్చిలోనే ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేశారు. కానీ, అన్ని ప్రాంతాల్లో థియేటర్లని పూర్తిగా తెరవకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘మరక్కర్’ ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలొచ్చాయి. వాటిల్లో నిజంలేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. డిసెంబరు 2న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ పీరియాడికల్ ప్రాజెక్టు విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ వస్త్రాలంకరణ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు దక్కించుకుంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.