Dasara Bullollu: ఇమ్మాన్యుయేల్‌పై వర్ష ఫిర్యాదు.. రోజా సీరియస్‌!

బుల్లితెరపై జోడీగా కనిపించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇమ్మాన్యుయేల్‌, వర్ష. ఆన్‌స్క్రీన్‌పై ఎప్పుడూ తమ ప్రేమను వ్యక్తం చేసే ఈ జంట తొలిసారి కోపాన్ని ప్రదర్శించింది.

Published : 14 Oct 2021 02:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెరపై జోడీగా కనిపిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇమ్మాన్యుయేల్‌, వర్ష. ఆన్‌స్క్రీన్‌పై ఎప్పుడూ తమ ప్రేమను వ్యక్తం చేసే వర్ష తొలిసారి కోపాన్ని ప్రదర్శించింది. ఇమ్మాన్యుయేల్‌ ప్రవర్తనపై ప్రముఖ నటి రోజాకి వర్ష ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ‘దసరా బుల్లోళ్లు’ కార్యక్రమంలో చోటుచేసుకుంది. దసరా కానుకగా రూపొందిన ప్రత్యేక షో ఇది. అక్టోబరు 15న ‘ఈటీవీ’లో ప్రసారంకానుంది. తాజాగా ప్రోమో విడుదలైంది. ఆ సంగతులివీ..

‘పెళ్లి సందD’ సినిమా హీరో రోషన్‌, హీరోయిన్‌ శ్రీలీల, దర్శకుడు రాఘవేంద్రరావు అతిథులుగా మెరిశారు. ‘జబర్దస్త్‌’ నటులు అలనాటి చిత్రం ‘మాయా బజార్‌’ని రీక్రియేట్‌ చేసిన దృశ్యాలు కనువిందు చేశాయి. కృష్ణుడిగా గెటప్‌ శ్రీను, అభిమన్యుడిగా శేఖర్‌ మాస్టర్‌, శశిరేఖగా రోజా, శకునిగా ఆది, ఘటోత్కచుడిగా భాస్కర్‌ అలరించారు. ఈ క్రమంలో ఆది వేసిన పంచ్‌లు నవ్వులు పూయించాయి. ఈ తర్వాత ఓ డ్రామా మొదలవుతుంది. ‘చూడండి మేడమ్‌ నేను పక్కన ఉండగా మరో అమ్మాయిని తీసుకొచ్చాడు’ అని రోజాకి వర్ష ఫిర్యాదు చేసింది. ‘నేను ఆమెను ప్రేమించాను మేడమ్‌’ అని ఇమ్మాన్యుయేల్‌ గట్టిగా అరవగా రోజా సీరియస్‌ అయింది. ఈ హీట్‌ని తగ్గించేందుకు తన జీవితాన్ని వర్ష ఎలా మార్చేసిందో ఇమ్మాన్యుయేల్‌ వివరించే ప్రయత్నం చేశాడు. చివరిగా, అమ్మవారి (దుర్గ) అవతారంలో రోజా చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందడంతా చూడాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి..

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు