Athadu Spoof: నాజర్‌గా గెటప్‌ శ్రీను.. భరణిగా ఆది.. మరి మహేశ్‌బాబు ఎవరో తెలుసా?

బుల్లితెరపై నవ్వులు పంచడమే కాదు, విభిన్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తోన షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.

Updated : 15 Aug 2022 16:51 IST

హైదరాబాద్‌: బుల్లితెరపై నవ్వులు పంచడమే కాదు, విభిన్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తోన షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ప్రతి ఆదివారం తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షోలో సుధీర్‌, ఆది, రాంప్రసాద్‌లతో పాటు, జబర్దస్త్‌ కమెడియన్స్‌ చేసే స్కిట్‌లు కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘అతడు’ సినిమాలోని పొలం ఎపిసోడ్‌నూ స్పూఫ్‌ చేశారు. తనికెళ్ల భరణిగా ఆది అదరగొట్టగా, నాజర్‌ పాత్రలో గెటప్‌ శ్రీను నవ్వులు పంచాడు. ఇక మహేశ్‌బాబుగా సుధీర్‌ చెప్పిన డైలాగ్‌లు, వేసిన పంచ్‌లు చూస్తే నవ్వాపుకోలేరు. ఆద్యంతం అలరించేలా సాగిన ఆ ఎపిసోడ్‌ను చూసేయండి.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని