Karnataka Politics: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై
కర్ణాటకలో యడియూరప్ప రాజీనామాతో కొత్త వారసుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైని భాజపా ఖరారు చేసింది. రాష్ట్ర ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన......
బెంగళూరు: కర్ణాటకలో యడియూరప్ప రాజీనామాతో కొత్త వారసుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైని భాజపా ఖరారు చేసింది. కర్ణాటక ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన లింగాయత్ సామాజిక వర్గానికే మళ్లీ సీఎం పీఠాన్ని అప్పగిస్తూ కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. బసవరాజ్ బొమ్మై ఎంపికపై భాజపాలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కొత్త సీఎంను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా కొనసాగుతున్న బొమ్మై.. మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. యడియూరప్పకు కూడా అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.
రేపు ప్రమాణస్వీకారం
మరోవైపు, భాజపా శాసనసభాపక్ష సమావేశం బెంగళూరులో కొనసాగుతోంది. ఈ సమావేశానికి భాజపా అధిష్ఠానం పరిశీలకులుగా నియమించిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జి అరుణ్ సింగ్, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న యడియూరప్ప హాజరయ్యారు. బొమ్మై ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్కు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త సీఎంగా బుధవారం ఉదయం 11గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
బొమ్మై వైపే అధిష్ఠానం మొగ్గు
మరోవైపు, కొత్త సీఎం రేసులో రాష్ట్ర గనుల శాఖమంత్రి మురుగేశ్ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాట్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ, ప్రభుత్వ చీఫ్ విప్ సునీల్ కుమార్ తదితర కీలక నేతల పేర్లు కూడా ప్రధానంగా వినబడినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బొమ్మై వైపే భాజపా అధిష్ఠానం మొగ్గుచూపింది.
యడియూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు నిన్న మధ్యాహ్నం ప్రకటించినప్పట్నుంచి ఆయన వారసుడు ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. యడ్డీ తన రాజీనామా లేఖను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్కు పంపగా.. ఆయన ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లింగాయత్ వర్గంలో బలమైన నేతగా ఉన్న యడియూరప్ప స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని, పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని కూడా ఇప్పటికే ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు