దేశం మొత్తం మీ వెంటే: సచిన్‌ పైలట్

ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవడం, నిరుద్యోగం పెరగడం వంటి సమస్యలపై కేంద్రం మీద కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను మరోనేత సచిన్‌ పైలట్ సమర్థించారు.

Published : 13 Sep 2020 01:28 IST

చైనా దురాక్రమణ కట్టడికి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకే

జైపూర్‌: ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవడం, నిరుద్యోగం పెరగడం వంటి సమస్యలపై కేంద్రం మీద కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను మరోనేత సచిన్‌ పైలట్ సమర్థించారు. శనివారం పైలట్ మీడియాతో మాట్లాడుతూ..భారత్, చైనా సరిహద్దు సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఇతర విషయాలను ప్రస్తావిస్తుందంటూ మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీజీ లేవనెత్తిన అంశాలు సమర్థనీయమైనవి. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. 2.10 కోట్ల మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. జీతాల్లో కోత విధిస్తున్నారు. మరోవైపు చైనా మన భూభాగంలోకి ప్రవేశిస్తోంది. భారత్, చైనా సరిహద్దు వివాదంపై ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం ఇతర విషయాల గురించి మాట్లాడుతోంది’ అంటూ ఆయన విమర్శలు చేశారు. అలాగే చైనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దేశం మొత్తం వెంట ఉంటుందన్నారు. 

శనివారం రాహుల్ గాంధీ ట్విటర్‌ వేదికగా కరోనా వైరస్‌ కారణంగా దేశం ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలన్నింటిని పక్కనబెట్టి అంతాబాగానే ఉందంటూ ప్రభుత్వం, మీడియా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు