అధిష్టానాన్ని ఎలాంటి పదవి కోరలేదు: పైలట్
కాంగ్రెస్ తిరుగుబాటు నేత, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం సాయంత్రం జైపుర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మద్దతుదారుల నుంచి ఆయనకు...
జైపుర్ విమానాశ్రయంలో ఘనస్వాగతం
జైపుర్: కాంగ్రెస్ తిరుగుబాటు నేత, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం సాయంత్రం జైపుర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మద్దతుదారుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్తో విభేదించి సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో నెల రోజులుగా హరియాణాలోని ఒక రిసార్టులో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అనంతరం పార్టీలో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సచిన్ వర్గం డిమాండ్లను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కే.సీ. వేణుగోపాల్ ప్రకటించారు. దీంతో రాజస్థాన్లో నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. దీంతో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం సచిన్ పైలట్ జైపుర్కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ తాను ఎలాంటి పదవి డిమాండ్ చేయలేదని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలానే రాజకీయాల్లో సమస్యలు, విధానాలపరంగా పనిచేయాలని, వ్యక్తిగత శత్రుత్వం ఉండకూడదని అన్నారు. పార్టీ నాయకత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా తాము మాట్లాడలేదని, తమ గురించి కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ, ఎన్నో రకాల ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ ఈ 30 రోజులు తాము ఎంతో ఓపికతో వ్యవహరించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని మాత్రమేనని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు