ఆ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: సచిన్ పైలట్
రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శత్రుత్వానికి స్థానం లేదని రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ అన్నారు. తన మాజీ బాస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్...
దిల్లీ/జైపుర్: రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శత్రుత్వానికి స్థానం లేదని రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ అన్నారు. తన మాజీ బాస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తనను పనికిరానివాడని దూషించినా, భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నానని ఆరోపించినా ఆయనను గౌరవిస్తానని సచిన్ తెలిపారు. ‘‘ఇతరులతో సహా, నా బద్ధ శత్రువులను నేను ఎంత వ్యతిరేకించినా వారిపట్ల నేను అలాంటి మాటలు ఉపయోగించను. అలాంటి విలువలను నేను నా కుటుంబం నుంచి పొందాను. అశోక్ గహ్లోత్ నా కంటే పెద్దవారు, వ్యక్తిగతంగా ఆయనను నేను ఎంతో గౌరవిస్తాను. పని, పాలనాపరమైన వ్యవహారాలలో నా అభిప్రాయాలను వ్యక్తపరచే హక్కు నాకు ఉంది. కానీ అశోక్ గహ్లోత్ గారి వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. వాటిపై ఇప్పుడు నేను స్పందించాలనుకోవడం లేదు. మాట్లాడేటప్పుడు సరైన భాషను ఉపయోగించాలి. ఇతరుల గురించి బహిరంగంగా మనం వ్యాఖ్యలు చేసేప్పుడు దానికి భాషాపరమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. గత ఇరవై ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఆ లక్ష్మణ రేఖను నేను ఎప్పుడూ దాటలేదు’’ అని అన్నారు.
నెల రోజుల క్రితం అశోక్ గహ్లోత్తో విభేదించి, మరో 18మంది ఎమ్మెల్యేలతో తిరుబాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో సచిన్ పైలట్ భేటీ అయ్యారు. తన వర్గం డిమాండ్లను వారు ఎంతో ఓపిగ్గా విన్నారని, వాటిని పరిష్కరిస్తామని మాట ఇచ్చినట్లు సచిన్ వెల్లడించారు. దీంతో రాజస్థాన్లో నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు నిన్నటితో తెరపడిన సంగతి తెలిసిందే. తాను చివర వరకు పార్టీలోనే కొనసాగనున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిగిన చర్చల అనంతరం పైలట్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM