కాంగ్రెస్లోనే సచిన్ పైలట్!
రాజస్థాన్లో నెలరోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం చివరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది.
నెల రోజుల రాజకీయ ప్రతిష్టంభనకు తెర..
సోనియా, రాహుల్గాంధీలకు కృతజ్ఞతలు తెలిపిన సచిన్
జైపుర్: రాజస్థాన్లో నెలరోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం చివరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. పార్టీ అధిష్ఠానంతో చర్చల అనంతరం సచిన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తమ వేదనను అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘తమ సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారానికి కృషి చేసిన సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నేను నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నాను. అంతేకాకుండా మెరుగైన భారత్ కోసం పనిచేస్తాను. రాజస్థాన్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాపాడుకోవడంతోపాటు ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి కృషి చేస్తాను’ అని సచిన్ పైలట్ ట్విటర్లో ప్రకటించారు. సొంత ప్రయాజనాలు లేవని.. కేవలం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే సమస్యలను లేవనెత్తనట్లు సచిన్ స్పష్టం చేశారు.
సచిన్ పైలట్ వర్గం లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కె.సీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈసమయంలో పార్టీ నిర్ణయాన్ని సచిన్ పైలట్ స్వాగతించారు. అయితే సచిన్ పైలట్, రాహుల్ గాంధీల మధ్య జరిగిన చర్చల సారాంశం మాత్రం బయటకు రాలేదు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై అసమ్మతి స్వరం వినిపిస్తూ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్తోపాటు మరో 18మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే సమయంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
స్పందించిన కపిల్ సిబాల్..
రాజస్థాన్లో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందించారు. ఆగస్టు 14కు కౌంట్డౌన్ మొదలైంది. సచిన్ పైలట్కు భరోసా లభించింది. భాజపా మాత్రం నేలకొరిగింది. అవకాశవాదం సురక్షితమైంది కాదు అని తనదైన శైలిలో భాజపాకు చురుకలంటించారు.
ఇవీ చదవండి..
‘రాజీ’స్థాన్: పైలట్ ల్యాండింగ్కు కారణమిదేనా..?
సచిన్ పైలట్కు ఉద్వాసన!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM