Karnataka Politics: ఈ ప్రభుత్వం కూలిపోవచ్చు..
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని.....
సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్నారు. ఈ ప్రభుత్వం పూర్తికాలం పాటు కొనసాగుతుందని తాను అనుకోవడంలేదని విలేకర్లతో అన్నారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే సొంత ప్రభుత్వ అన్యాయంపైనే మహాత్మా గాంధీ విగ్రహం ముందు కూర్చొని విలపిస్తున్నారన్నారు. కొందరు మంత్రులు తాము సంతృప్తిగా లేమని చెబుతుండగా.. ఇంకొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు రానందుకు అసంతృప్తితో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. బసనగౌడ పాటిల్ యత్నాల్, సీపీ యోగేశ్వర్, ఎస్ఏ రామదాస్, అరవింద్ లింబవలి, అరవింద్ బెల్లాడ్ వంటి భాజపా అసంతృప్త నేతలను ఉటంకిస్తూ వీరంతా మంత్రి పదవులు రానందుకు అసంతృప్తితో దిల్లీ వెళ్తున్నారని చెప్పారు. ఈ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం లేదని తాను అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. తాజాగా ప్రభుత్వం పడిపోతుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
యడియూరప్ప రాజీనామాతో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో 13 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదని విమర్శించారు. కేవలం నాలుగైదు జిల్లాలకు మంత్రులు లేకపోతే అర్థంచేసుకోవచ్చు.. కానీ మైసూరు, చామరాజనగర్, కొడగు తదితర 13 జిల్లాల నుంచి అసలు మంత్రులే లేరన్నారు. ఒక్క బెంగళూరు నుంచే ఏడుగురు మంత్రులుగా ఉన్నారన్నారు. దీనికి బదులుగా ఇతర జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందని సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM