Bhabanipur bypoll: లాయర్ల సమరం.. మమతదే (నా) విజయం!?
ముగ్గురు న్యాయవాదుల మధ్య జరుగుతున్న పోటీలో మమత విజయం సునాయాసమే కానుందని విశ్లేషణలు వినవస్తున్నాయి. సెప్టెంబర్ 30న ఈ స్థానానికి పోలింగ్ జరగనుండగా. అక్టోబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మరోసారి ఎన్నికల సమరం జరగబోతోంది. మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా అందరి దృష్టీ భవానీపూర్పైనే. ఈ సారి అక్కడ పోటీ చేస్తోంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కాబట్టి. ఇక్కడ మమతకు పోటీగా భాజపా, సీపీఎం తమ అభ్యర్థులను నిలబెట్టాయి. వీరిద్దరూ వృత్తిరీత్యా న్యాయవాదులే కావడం గమనార్హం. మమత కూడా న్యాయ విద్యను అభ్యసించిన వారే. ముగ్గురు న్యాయవాదుల మధ్య జరుగుతున్న పోటీలో మమత విజయం సునాయాసమే కానుందని విశ్లేషణలు వినవస్తున్నాయి. సెప్టెంబర్ 30న ఈ స్థానానికి పోలింగ్ జరగనుండగా. అక్టోబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వేళ ప్రత్యర్థుల నేపథ్యం.. వారి గెలుపు ధీమా ఏంటి? విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం..
భాజపా వంటి బలమైన పార్టీని ఓడించి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మమతా బెనర్జీది. అయితే, భాజపా అభ్యర్థి, ఒకప్పుడు పార్టీలో నంబర్.2గా ఉన్న సువేందు అధికారి చేతిలో నందిగ్రామ్ స్థానం నుంచి ఓడిపోవడంతో దీదీ మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన భవానీపూర్ నుంచే మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఆ పార్టీ నుంచి గెలుపొందిన సోవన్దేవ్ఛటోపాధ్యాయ్ మమత కోసం ఆ సీటును త్యాగం చేశారు. పశ్చిమబెంగాల్లో జంగీపుర్, సంసీర్గంజ్ అభ్యర్థుల మరణంతో అక్కడి ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పోటీ చేసే ముగ్గురూ లాయర్లే..
భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ న్యాయవాదులే కావడం గమనార్హం. 1982లో కోల్కతాలోని జోగేశ్ చంద్ర కళాశాల నుంచి మమత లా డిగ్రీ పూర్తిచేశారు. తర్వాతి కాలంలో రాజకీయాల్లో బిజీ అయిపోయారు. భాజపా నుంచి బరిలో దిగిన ప్రియాంక తిబ్రీవాల్ కూడా న్యాయవాదే. హజ్రా లా కళాశాల నుంచి ఆమె న్యాయవాద పట్టా పొందారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై తృణమూల్ ప్రభుత్వంపై ఆమె పలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే గతంలో ఎంటల్లీ నుంచి పోటీచేసినా ఓడిపోయారు. ఇక సీపీఎం నుంచి పోటీ చేస్తున్న శ్రీజిబ్ విశ్వాస్ అలీపూర్ కోర్టులో లాయర్గా పనిచేస్తున్నారు. తొలిసారి రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈయన కూడా హజ్రా లా కాలేజీలోనే న్యాయవాద పట్టా పొందారు. కాంగ్రెస్ ఈ సారి పోటీకి దూరంగా ఉంది.
ఎవరి ధీమా వారిదే..
* భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ 2011, 2016లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గ ప్రజలతో ఆమెకు దశాబ్దంగా అనుబంధం ఉంది. పైగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండడం, స్వయాన సీఎం కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. ఈ సారి రికార్డు స్థాయి మెజార్టీతో ఆమె విజయం సాధిస్తుందని తృణమూల్ ధీమాగా ఉంది. మరోవైపు దీదీ మళ్లీ తమ నియోజకవర్గానికి రావడం తమకు ఆనందంగా ఉందని ఆ నియోజకవర్గ వాసి ఒకరు చెప్పుకొచ్చారు.
* అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించి భంగపడిన భాజపాకు ఉప ఎన్నికల్లో మమతపై పోటీ చేసేందుకు సీనియర్ నాయకులెవరూ ముందుకు రాలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో నామమాత్రంగా ఆ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపినట్లు అర్థమవుతోంది. అయితే ప్రియాంక తిబ్రీవాల్ మాత్రం విజయం పట్ల ధీమాగా ఉన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలే ప్రధాన అజెండాగా ఆమె ముందుకెళ్తున్నారు. తృణమూల్ ఆగడాలను ప్రజలకు వివరిస్తానని చెప్పుకొచ్చారు.
* గతంలో పశ్చిమ బెంగాల్ను సుదీర్ఘంగా ఏలిన వామపక్ష పార్టీలకు ఇటీవల జరిగిన ఎన్నికలు నిరాశే మిగిల్చాయి. దీంతో తమ ఉనికిని చాటేందుకు శ్రీజిబ్ విశ్వాస్ను వామపక్ష కూటమి బరిలో నిలిపింది. మమత హయాంలో అభివృద్ధి కుంటుపడిందని శ్రీజిబ్ ఆరోపించారు. తన పోరు ఆ రెండు పార్టీలపై అని వ్యాఖ్యానించారు.
విశ్లేషకులు ఏమంటున్నారు..?
భవానీపూర్ ఉప ఎన్నిక ఫలితం ఏకపక్షంగా వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్వాస్ చక్రవర్తి పేర్కొన్నారు. కాకలుతీరిన రాజకీయ నాయకురాలు ఒకవైపు.. రాజకీయాలకు ఏమాత్రం పరిచయం లేని మరో ఇద్దరు మరోవైపు పోటీలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. దీంతో తృణమూల్కు రికార్డు విజయం చేకూరే అవకాశం ఉందని చెప్పారు. భాజపా తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు, వామపక్ష పార్టీలు తమ ఉనికి చాటుకునేందుకు మాత్రమే ఈ ఉప ఎన్నికలో పాల్గొంటున్నాయని అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లో భాజపాపై ఉమ్మడి పోరులో కలిసి పోరాడాలన్న నిర్ణయానికి అనుగుణంగా కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టకపోవడం శుభపరిణామమని మరో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆయా విశ్లేషణలు బట్టి భవానీపూర్లో మమత విజయం ఖాయమేనని తెలుస్తోంది!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?