Basavaraj Bommai: సీఎం హోదాలో ఇక్కడికి వస్తానని ఊహించలేదు!
కర్ణాటక కొత్త సీఎంగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బసవరాజ్ బొమ్మై తొలిసారి.......
త్వరలో కేబినెట్ మంత్రులను ఎంపిక చేస్తామన్న బొమ్మై
బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బసవరాజ్ బొమ్మై తొలిసారి హుబ్బళ్లి నగరంలో పర్యటించారు. తాను ఇక్కడే పుట్టి, పెరిగానని, చాలా మంది స్నేహితులు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తాను ఎక్కువగా ఇష్టపడే నగరమిదేనన్నారు. ఈ నగరం అభివృద్ధికి చేయాల్సిందల్లా చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రత్యేక విమానంలో హుబ్బళ్లి విమానాశ్రయంలో దిగిన ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున నినాదాలతో ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. దీంతో ఆ జన సమూహాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. ఈ సందర్భంగా బొమ్మై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో హుబ్బళ్లిలో అడుగుపెట్టే రోజును తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. తనపై ఈ పెద్ద బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా పెట్టారని, యడియూరప్ప కూడా ఆశీర్వదించారని తెలిపారు.
త్వరలోనే కొత్త కేబినెట్ సభ్యులను ఎంపిక చేయనున్నట్టు బొమ్మై వెల్లడించారు. భాజపా జాతీయ నాయకత్వంతో చర్చల అనంతరం కొత్త జట్టును ఎంపిక చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఆశీస్సులు తీసుకొనేందుకు శుక్రవారం దిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లోనే మరోసారి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్లను కలిశాక.. రాష్ట్రంలో కొత్త కేబినెట్ కూర్పుపై చర్చించి మంత్రులను ఎంపిక చేస్తామని చెప్పారు.
మరోవైపు, బసవరాజ్ బొమ్మై గురువారం ఉత్తర కన్నడ జిల్లాలో పర్యటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించనున్నారు. ఉత్తర కన్నడ జిల్లాకు హుబ్బళ్లి మీదుగా వెళ్తూ మధ్యంలో అమర్గోల్ వద్ద తన తల్లిదండ్రుల సమాధులను సందర్శించి నివాళులర్పించారు. అంతకముందు ఆయన హుబ్బళ్లిలోని ఆరెస్సెస్ కార్యాలయమైన కేశవ్ కుంజ్కు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుబ్బళ్లి-ధార్వాడ్లపై తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తంచేశారు. ఈ జంట నగరాల్లో మౌలిక, పారిశ్రామికాభివృద్ధికి నిజాయతీగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం