గండ్ర మోహన్‌రావుకు రాజ్యసభ అవకాశం కల్పించాలి

తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ మొదటి అధ్యక్షుడు, బార్‌కౌన్సిల్‌ సభ్యుడైన గండ్ర మోహన్‌రావుకు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని తెరాస న్యాయవాద విభాగం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరింది. బార్‌ ...

Published : 06 Dec 2021 04:34 IST

తెరాస న్యాయవాద విభాగం విజ్ఞప్తి

తెరాస న్యాయవాద విభాగం సమావేశంలో మాట్లాడుతున్న బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చెంగల్వ కల్యాణ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ మొదటి అధ్యక్షుడు, బార్‌కౌన్సిల్‌ సభ్యుడైన గండ్ర మోహన్‌రావుకు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని తెరాస న్యాయవాద విభాగం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరింది. బార్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంగల్వ కల్యాణ్‌రావు అధ్యక్షతన ఆదివారం తెలంగాణభవన్‌లో తెరాస న్యాయవాద విభాగం సమావేశం జరిగింది. రవికుమార్‌, గోవర్ధన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, అజయ్‌కుమార్‌, రాము, మల్లేశ్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో గండ్రమోహన్‌రావు కీలకపాత్ర పోషించారని తెలిపారు. అనుభవజ్ఞుడు, న్యాయనిపుణుడైన గండ్రకు రాజ్యసభలో అవకాశం కల్పించడం వల్ల ఆయన మరిన్ని సేవలందించగలుగుతారని చెప్పారు. ఈ మేరకు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని