Kanhaiya Kumar: కాంగ్రెస్లోకి కన్నయ్య, జిగ్నేశ్.. ముహూర్తం ఫిక్స్!
జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్, గుజరాత్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది.
దిల్లీ: జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్, గుజరాత్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. మహాత్మగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న వారిద్దరూ కాంగ్రెస్లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్ 28నే వీరు పార్టీలో చేరాల్సి ఉండగా.. కొంచం ఆలస్యంగా చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల రాహుల్ గాంధీతో భేటీ అయినప్పుడే కన్నయ్య కుమార్ కాంగ్రెస్లో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. సీపీఐలో ఇమడలేకపోవడం ఆయన చేరికకు కారణమని తెలుస్తోంది. ఆయనను బిహార్ పార్టీశాఖకు అధ్యక్షుడిని చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు గుజరాత్ వాద్గాం నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సైతం చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్జిత్ సింగ్ను ఎంపిక చేయడాన్ని ఆయన స్వాగతించడం ఇందుకు బలం చేకూరింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేశ్ చేరిక కాంగ్రెస్కు కొంతమేర కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయనను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
-
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా