punjab elections: సవాళ్లు విసురుకుంటున్న ఆప్.. కాంగ్రెస్ పార్టీలు!
వచ్చే ఏడాది పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే, పంజాబ్లో అధికారమే
దిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే, పంజాబ్లో అధికారమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్న ఆప్కు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు విమర్శలతోపాటు సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా పంజాబ్ విద్యాశాఖ మంత్రి విసిరిన సవాల్ను కేజ్రీవాల్ స్వీకరించారు. పంజాబ్ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలంటూ ఘాటుగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇటీవల దిల్లీ విద్యాశాఖ మంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తూ.. దిల్లీ, పంజాబ్లో పది చొప్పున పాఠశాలలను ఎంపిక చేసి వాటి పరిస్థితిని సమీక్షిద్దామని, ఏ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయో చూద్దామని సవాల్ విసిరారు. దీనికి స్పందించిన పంజాబ్ విద్యాశాఖ మంత్రి పర్గత్ సింగ్ ‘పది కాదు, 250 పాఠశాలల స్థితిగతులు పరిశీలిద్దాం.. మీరు సిద్ధమా?’అని ఆప్ నేతలకు సవాల్ విసిరారు. ఆప్ ప్రభుత్వం కేవలం పది పాఠశాలలకే బడ్జెట్ కేటాయించి మెరుగు పర్చిందని.. వాటినే ప్రచారంలో వాడుకుంటుందని పర్గట్ సింగ్ విమర్శించారు. దిల్లీ, పంజాబ్లోని పాఠశాలల మౌలిక వసతుల గురించి చర్చ జరగాలని అన్నారు.
పర్గత్ సింగ్ సవాల్ను కేజ్రీవాల్ స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా దిల్లీలోని 250 పాఠశాల జాబితాను విడుదల చేస్తారని, పర్గత్ కూడా పంజాబ్లోని 250 పాఠశాలల జాబితాను విడుదల చేస్తే చర్చకు వస్తామని ప్రకటించారు. మరి దీనిపై పర్గత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
అమరావతి నుంచి సినీ నటి నవనీత్ రాణాకు భాజపా టికెట్
అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్ రాణా ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా