Jagdeep Dhankhar: బెంగాల్గవర్నర్ మరోసారిసంచలన వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్లో రాజకీయ పరిస్థితి భయానకంగా......
కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్లో రాజకీయ పరిస్థితి భయానకంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును కూడా స్వేచ్ఛగా, నిర్భీతిగా వినియోగించుకొనే పరిస్థితుల్లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారంటూ మండిపడ్డారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ధన్కర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ స్థాయిలో హింస చెలరేగిందో అంతా చూశామన్నారు. తమ ఇష్టప్రకారం ఓటు వేయాలనుకొనేవారు ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ నిజనిర్ధారణ కమిటీ కూడా ఇక్కడ పాలకుల ఇష్టానుసారమే పరిపాలన సాగుతోంది తప్ప.. చట్ట ప్రకారం కాదనే విషయాన్ని గ్రహించిందన్నారు.
సీఎం మమత పైనా విసుర్లు
అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ రాజ్యాంగ నిబంధనలు పాటించడంలేదనీ, తాను కోరిన సమాచారం ఇవ్వడంలేదంటూ గవర్నర్ ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ కూడా పలు సందర్భాల్లో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. గవర్నర్ గురించి ఏదైనా మాట్లాడేందుకు లైసెన్స్ ఉందని స్పీకర్ అనుకుంటున్నారేమో అంటూ గవర్నర్ మండిపడ్డారు. బీఎస్ఎఫ్ పరిధి పెంపు అంశంపై అసెంబ్లీ చేసిన తీర్మానం సహా పలు సందర్భాల్లో తాను కోరిన సమాచారాన్ని స్పీకర్ ఇవ్వలేదన్నారు.అలాగే, ప్రభుత్వ బిల్లులు, సిఫారసులకు సంబంధించిన ఏ ఫైలూ తన వద్ద పెండింగ్లో లేవని స్పష్టంచేశారు.
స్పందించిన స్పీకర్
మరోవైపు, గవర్నర్ తనపై చేసిన ఆరోపణలపై స్పీకర్ బిమన్ బెనర్జీ స్పందించారు. గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత అమర్యాదకరమన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్కు నివాళులర్పించేందుకు గవర్నర్ అసెంబ్లీ వద్దకు వచ్చారనీ.. కానీ, ఆయన మీడియా సమావేశం కోసం ఈ వేదికను వినియోగించుకుంటారని తాము అనుకోలేదని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.