Amarinder Singh: రాజీనామా యోచనలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్?
తాజా పరిణామాలతో విసిగిపోయానని సీఎం అమరీందర్ సింగ్ అధిష్ఠానానికి తెలిపినట్లు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది....
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్లో సంక్షోభం ముదిరినట్లు సంకేతాలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో విసిగిపోయానని సీఎం అమరీందర్ సింగ్ అధిష్ఠానానికి తెలిపినట్లు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా గవర్నర్కు రాజీనామా లేఖ అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈరోజు సాయంత్రం పంజాబ్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై అమరీందర్ వారసుణ్ని ఎన్నుకోనున్నట్లు సమాచారం.
పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి హరీశ్ రావత్ దాదాపు అర్ధరాత్రి సమయంలో చేసిన ట్వీట్తో తాజా పరిణామాలకు నాంది పడింది. అత్యవసర శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు.. ప్రతిఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సైతం ప్రతిఒక్కరూ సమావేశానికి రావాలని ఆదేశించారు. పైకి ఇవన్నీ హఠాత్తుగా జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ.. గత కొంతకాలంగా పార్టీలో అంతర్గతంగా లుకలుకలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
సీఎం వ్యతిరేక వర్గం అధిష్ఠానానికి ఇటీవల లేఖ రాసినట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి అమరీందర్ చేరుకోవాల్సిన లక్ష్యాల పురోగతిపై సమీక్ష జరపాలని కోరినట్లు సమాచారం. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే అధిష్ఠానం సీఎల్పీ సమావేశం నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, అధిష్ఠానం తొలుత కొంతమంది పెద్దలను పంపి పంజాబ్ కాంగ్రెస్లో పరిస్థితులపై ఆరా తీయాలని భావించిందట! కానీ, ఇది తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని.. అమరీందర్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య భేదాభిప్రాయాలు ముదిరే అవకాశం ఉందని భావించి.. చివరకు సీఎల్పీ సమావేశం వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ పరిణామాలతో అమరీందర్ సింగ్ విసిగిపోయినట్లు తెలుస్తోంది. తన అసంతృప్తిని ఆయన నేరుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం మార్పు జరుగుతోందంటూ గత కొంత కాలంగా వార్తలు రావడం తనకు అవమానకరంగా ఉందని సోనియా ముందు వాపోయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఓ వర్గం తనపై కొన్ని నెలలుగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పార్టీ సీఎల్పీ సమావేశానికి పిలుపునివ్వడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక తాను పదవిలో కొనసాగలేనని తెలిపినట్లు తెలుస్తోంది.
కొంతకాలం క్రితం సిద్ధూ, అమరీందర్ సింగ్ మధ్య కోల్డ్ వార్ నడిచిన విషయం తెలిసిందే. అయితే, రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఓవైపు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ను బుజ్జగిస్తూనే మరోవైపు నవజోత్ సింగ్ సిద్ధూకు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పారు. తొలుత కెప్టెన్ అమరీందర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధూతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మారలేదని తాజా పరిణామాలతో అర్థమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ