సొంత గూటికి పైలట్?.. రాహుల్తో భేటీ!
అసెంబ్లీ సమావేశాల తేదీ సమీపిస్తున్న వేళ రాజస్థాన్ రాజకీయాలు మళ్లీ రక్తికడుతున్నాయి. నిన్నటి వరకు ఎవరి క్యాంపులు వారివే.. ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లు సైలెంట్గా ఉన్న రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చేందుకు......
జైపుర్: అసెంబ్లీ సమావేశాల తేదీ సమీపిస్తున్న వేళ రాజస్థాన్ రాజకీయాలు మళ్లీ రక్తికడుతున్నాయి. నిన్నటి వరకు ఎవరి క్యాంపులు వారివే.. ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లు సైలెంట్గా ఉన్న రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సోమవారం భేటీ అయ్యారు.
సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన నాటి నుంచి సచిన్ పైలట్ను వెనక్కి రప్పించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. అయినా సచిన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే, ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సచిన్ పైలట్ మనసు మార్చుకుని పార్టీలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్తో భేటీ అయ్యారు. రాహుల్తో భేటీ విషయంలో ఇద్దరు పార్టీ సీనియర్ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.
మరోవైపు ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీలో పైలట్ వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోకూడదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, అశోక్ గహ్లోత్ మాత్రం పార్టీ అధిష్ఠానానికే తుది నిర్ణయం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. అధిష్ఠానానికి క్షమాపణ చెప్పి, అసెంబ్లీలో బల పరీక్షకు పార్టీకి అనుకూలంగా ఓటేస్తే వారిని క్షమించి తిరిగి తీసుకుంటామని సీడబ్ల్యూసీ సభ్యుడు ఒకరు తెలిపారు. రాహుల్తో భేటీ అనంతరం ఓ స్పష్టత రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?