Sachin Pilot: ఆమె ఆ సచిన్‌తో మాట్లాడారేమో!

తాను భాజపాలో చేరతానంటూ ఆ పార్టీ నేత రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్‌ స్పందించారు.

Updated : 11 Jun 2021 16:35 IST

నాతో మాట్లాడేంత ధైర్యం లేదు

దిల్లీ: సచిన్‌ పైలట్‌ భాజపాలో చేరతారంటూ ఆ పార్టీ నేత రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్‌ స్పందించారు. ఈ విషయంపై తాను సచిన్‌తో మాట్లాడానని రీటా చెప్పగా.. ఆమెకు తనతో మాట్లాడే ధైర్యం లేదని ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘సచిన్‌తో మాట్లాడానని రీటా బహుగుణ చెప్పారు. ఆమె సచిన్‌ తెందూల్కర్‌తో మాట్లాడి ఉండొచ్చు. నాతో మాట్లాడే ధైర్యం ఆమెకు లేదు’ అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. ఈ క్రమంలో సచిన్ పైలట్ కూడా పార్టీని వీడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సచిన్ తిరుగుబావుటా ఎగురవేయగా.. అధిష్ఠానం ఆయన్ను బుజ్జగించింది. దాంతో పార్టీ మార్పుపై వచ్చిన వార్తలు సద్దుమణిగాయి. మళ్లీ జితిన్ ప్రసాద కారణంగా అవి ఊపందుకున్నాయి. ‘సచిన్ త్వరలో భాజపాలో చేరతారు. కాంగ్రెస్ ఆయన్ను గౌరవించలేదు’ అంటూ బహుగుణ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని