Rajasthan: కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో సంతోషంగా ఉంది: సచిన్ పైలట్
నేడు రాజస్థాన్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. దీనిపై ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ హర్షం వ్యక్తం చేశారు....
జైపుర్: నేడు రాజస్థాన్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై దాదాపు ఏడాది క్రితం ఆయన తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన డిమాండ్లను అంగీకరిస్తూ.. అధిష్ఠానం కేబినెట్లో ఆయన వర్గానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం 4 గంటల సమయంలో మొత్తం 15 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దళితులకు స్థానం..
ఈ పరిణామంపై నేడు సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడారు. దళితులు, పేద వర్గాలకు కేబినెట్లో స్థానం కల్పించడం సంతోషకరమన్నారు. పార్టీ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సానుకూల సంకేతాలు వెళతాయని తెలిపారు. పలుసార్లు ఈ విషయాన్ని పార్టీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. దీని ప్రాధాన్యాన్ని గుర్తించడం సంతోషంగా ఉందన్నారు.
మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి..
కేబినెట్లో నలుగురు దళిత నేతల్ని చేర్చుకోనున్నారన్నారని సచిన్ పైలట్ తెలిపారు. దీంతో పార్టీ, ప్రభుత్వం ఆయా వర్గాల్లోకి సానుకూల సంకేతాలు పంపిందన్నారు. సుదీర్ఘకాలంగా కేబినెట్లో దళితులకు చోటు లేదన్నారు. తాజాగా దళితులతో పాటు గిరిజనులను కూడా స్థానం కల్పించారన్నారు. 2023లో రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.స్లో ఎలాంటి వర్గాలు లేవని.. నిర్ణయాలన్నీ కలిసి కట్టుగానే తీసుకున్నామన్నారు. ఇకపై కార్యకర్తలు, నాయకులు ఏకతాటిపై పనిచేస్తూ భాజపా వైఫల్యాలను ఎండగట్టాలని పిలపునిచ్చారు. ఇటీవలే తాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యానన్నారు. గత 20 ఏళ్లుగా పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వర్తించానన్నారు. ఇకపై పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
తన వర్గానికి పెద్ద పీట..
గత ఏడాది ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల్లో తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన తన ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. కానీ, పైలట్ డిమాండ్లకు అధిష్ఠానం అంగీకరించడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ క్రమంలోనే తాజాగా అధిష్ఠానాన్ని కలిసిన ఆయన తన డిమాండ్ల పరిష్కారం దిశగా పావులు కదిపారు. తన వర్గంలోని కీలక ఎమ్మెల్యేలను కేబినెట్లో చేర్చించడంలో ఒకరకంగా విజయం సాధించారు.
మరి పైలట్కు ఏ బాధ్యతలు?
అయితే, ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత సచిన్ పైలట్ ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారనే దానిపై స్పష్టత లేదు. వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్లో పార్టీ బాధ్యతలు నిర్వర్తించాలని రాహుల్, ప్రియాంక కోరినట్లు సమాచారం. కానీ, అందుకు పైలట్ సుముఖంగా లేరని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతులు చేపట్టే అవకాశం ఉంది! ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రంపైనే ఆయన దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..