కాంగ్రెస్లో ఎదిగినవారే దాన్ని ముంచాలనుకుంటున్నారు: శివసేన
కాంగ్రెస్ పార్టీని కాదని కేంద్రంలో యూపీఏకి ప్రత్యామ్నాయంగా మరో కూటమిని తీసుకురావడం భాజపాకు మేలు చేయడమేనని శివసేన ఆరోపించింది....
ముంబయి: కాంగ్రెస్పై ఇటీవల విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెట్టిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీపై శివసేన పెదవి విరిచింది. కాంగ్రెస్ పార్టీని కాదని కేంద్రంలో యూపీఏకి ప్రత్యామ్నాయంగా మరో కూటమిని తీసుకురావడం భాజపాకు మేలు చేయడమే అవుతుందని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో శనివారం సంపాదకీయం రాసింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిని వద్దనుకునేవారు ఆ విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని శివసేన తెలిపింది. పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించొద్దని కోరింది. విపక్షాల్లో ఐక్యత లేనట్లయితే, భాజపాకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించడంపై మాట్లాడడం మానుకోవాలని హితవు పలికింది. మమత ఇటీవల ముంబయిలో శరద్ పవార్ సహా కొంత మంది కీలక నేతలను కలిసిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ అస్తిత్వాన్నే ప్రశ్నించారు. ‘యూపీఏనా! అదెక్కడుంది?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు శుక్రవారం ఆ పార్టీ పత్రిక ‘జాగో బంగ్లా’లో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శివసేన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘‘కాంగ్రెస్ను ఓడించడమే ప్రధాని మోదీ, భాజపా అజెండా. కానీ, మోదీ, భాజపాను వ్యతిరేకించే వారు కూడా కాంగ్రెస్ను ఓడించాలని భావిస్తే అది పెద్ద ప్రమాదం. గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని కోల్పోవడం ఆందోళన కలిగించే విషయమే. అయితే, దాన్ని మరింత ముంచి ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చూడడం మాత్రం సమంజసం కాదు’’ అని సామ్నాలో శివసేన అభిప్రాయపడింది.
‘ప్రతిపక్షాల నాయకత్వం కాంగ్రెస్ దైవదత్త హక్కేమీ కాదు’ అని వ్యాఖ్యానించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్నూ శివసేన తప్పుబట్టింది. ఎవరికీ దైవదత్త హక్కులు ఉండవని వ్యాఖ్యానించింది. గతంలో భాజాపాపై వచ్చిన కొన్ని విమర్శల్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. శాశ్వతంగా ప్రతిపక్ష హోదాలో ఉండేందుకే కమలం పార్టీ పుట్టిందంటూ పలువురు విమర్శలు చేశారని తెలిపింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ ఏ స్థాయికి ఎదిగిందో గమనించాలని పేర్కొంది. పరోక్షంగా కాంగ్రెస్కూ పునర్వైభవం వస్తుందని చెప్పకనే చెప్పింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ పోరాటం చేస్తున్నారని తెలిపింది. కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగినవాళ్లే ఇప్పుడు ఆ పార్టీని ముంచాలనుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
ఈ పరిణామాలపై సోనియా, రాహుల్ నోరు విప్పాలని శివసేన సూచించింది. యూపీఏపై వారి ప్రణాళికలేంటో వివరించాలని కోరింది. ఇతర పార్టీలకు కాంగ్రెస్తో విభేదాలున్నప్పటికీ.. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే యూపీఏ కూటమి మనుగడ సాధ్యమేనని వ్యాఖ్యానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు