Punjab: సీఎం మార్పుతో రాహుల్ గాంధీ ప్రజలకు నమ్మకాన్ని కల్పించారు: సిద్ధూ
కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీపై సిద్ధూ ప్రశంసించారు. రాహుల్ గాంధీ ఓ ముఖ్యమంత్రిని నియమించడమే కాదు.....
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి కెప్టెన్ అమరీందర్సింగ్ అకస్మాతుగా తప్పుకోవడం.. కొత్త సీఎంగా పలువురి పేర్లు వినిపించినప్పటికీ అనూహ్యంగా చరణ్జిత్ చన్నీ ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. అమరీందర్ నాయకత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్సింగ్ సిద్ధూ.. తాజాగా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీపై ప్రశంసించారు. ‘రాహుల్ గాంధీ ఓ ముఖ్యమంత్రిని నియమించడమే కాదు.. ప్రజలకు నమ్మకం, ధైర్యాన్ని కల్పించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై నూతన ముఖ్యమంత్రి పనిచేయడం ప్రారంభించారు’ అని సిద్ధూ పేర్కొన్నారు.
అమరీందర్సింగ్కు, ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సిద్ధూకు మధ్య మొదటి నుంచీ విభేదాలున్నాయి. సిద్ధూ మద్దతుదారులైన పలువురు ఎమ్మెల్యేలు కెప్టెన్పై గతంలో తిరుగుబాటు ప్రకటించారు. అధిష్ఠానానికి సీఎం వ్యతిరేక వర్గం ఇటీవల లేఖ రాసినట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు పార్టీలోని లుకలుకలను అవమానకరంగా భావించిన అమరీందర్సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. సీఎం అభ్యర్థిగా సునీల్ జాఖడ్, సుఖ్జీందర్సింగ్ రంధ్వా, రాజేందర్ కౌర్ భట్టల్ వంటి సీనియర్ నేతల పేర్లు వినిపించాయి. కానీ వారిని కాదని.. ఎస్సీ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరణ్జిత్కు కాంగ్రెస్ పట్టం కట్టింది. నేడు ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్