Karnataka Cabinet Expansion: 29మందితో బొమ్మై కొత్త టీమ్.. యడ్డీ తనయుడికి దక్కని చోటు!
కర్ణాటక కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం తర్వాత బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ......
బెంగళూరు: కర్ణాటక కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం తర్వాత బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రెండు పర్యాయాలు దిల్లీ పర్యటనకు వెళ్లి భాజపా అధిష్ఠాన పెద్దలతో చర్చించి తర్జనభర్జనల అనంతరం బొమ్మై.. 29 మందితో కొత్త జట్టును ఎంపిక చేశారు. వీరందరితో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ రాజ్భవన్లో బుధవారం మధ్యాహ్నం 2.15గంటల తర్వాత ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త కేబినెట్లో యడియూరప్ప తనయుడు విజయేంద్రకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఈ జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం.
ప్రమాణస్వీకారానికి ముందు యడియూరప్పని కలిసిన దృశ్యం..
కొత్త మంత్రులు వీరే..
2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పక్కా వ్యూహంతో కొత్త మంత్రుల జాబితాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో గోవింద్ కర్జోల్, కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక, బి. శ్రీరాములు, వి.సోమన్న, ఉమేశ్ కత్తి, ఎస్.అంగర, జేసీ మధుస్వామి, అరగ జ్ఞానేంద్ర, సీఎన్ అశ్వథ్నారాయణ, సీసీ పటేల్, ఆనంద్ సింగ్, కోట శ్రీనివాస పూజారి, ప్రభు చౌహాన్, మురుగేశ్ నిరానీ, శివరామ హెబ్బార్, ఎస్టి సోమేశేఖర్, బీసీ పటేల్, బీఏ బసవరాజ, డాక్టర్ కె.సుధాకర్, కె. గోపాలయ్య, శశికళ జొల్లె, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారాయణ గౌడ, బీసీ నగేశ్, వి. సునీల్ కుమార్, హాలప్ప ఆచార్, శంకర పాటిల్ ముననకొప్ప, మునిరత్న ఉన్నారు.
పాత, కొత్త ముఖాల కలయికతో..
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షా, నడ్డా మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రజలకు ప్రజానుకూల పాలనను అందించడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ కేబినెట్ను ఎంపిక చేసినట్టు సీఎం బొమ్మై మీడియాకు వెల్లడించారు. అనుభవజ్ఞులతో పాటు కొత్త ముఖాల కలయికతో ఈ కేబినెట్ రూపుదిద్దుకున్నట్టు చెప్పారు. మొత్తంగా 29 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు ఆయన ఈ ఉదయం తెలిపారు.
మంత్రివర్గంలో సామాజిక కూర్పు ఇలా..
సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో పెద్ద వర్గమైన లింగాయత్లకుపెద్ద పీట వేశారు. బొమ్మై జట్టులో ఎనిమిది మంది లింగాయత్ వర్గానికి చెందినవారికి కేబినెట్లో చోటు కల్పించగా.. ఒక్కళిగల నుంచి ఏడుగురు , ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజికవర్గం నుంచి ముగ్గురు, ఎస్టీ నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు, మహిళల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను జైపుర్లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
భారతదేశపు సంపన్న మహిళ సావిత్రి జిందాల్ (Savitri Jindal), బిజేడీ నుంచి 6 సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి భాజపాలో చేరారు. -
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. -
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు