Charanjit Singh Channi: సిద్ధూ అల్టిమేటం.. వెనక్కి తగ్గని చన్నీ..!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పంజాబ్లో కాంగ్రెస్కు రోజుకో ఇబ్బంది పరిస్థితి తలెత్తుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్జోత్ సింగ్ సిద్ధూ చుట్టే విమర్శలు, ప్రతివిమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ముఖ్యమంత్రి, సిద్ధూ మధ్య కూడా సఖ్యత లేదని తెలుస్తోంది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా ఏపీఎస్ డియోల్ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ప్రస్తుత వివాదానికి కారణం.
ఎన్నికల వేళ కాంగ్రెస్కు ఇబ్బందిగా మారిన పంజాబ్ రాజకీయాలు
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పంజాబ్లో కాంగ్రెస్కు రోజుకో ఇబ్బంది పరిస్థితి తలెత్తుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్జోత్ సింగ్ సిద్ధూ చుట్టే విమర్శలు, ప్రతివిమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ముఖ్యమంత్రి, సిద్ధూ మధ్య కూడా సఖ్యత లేదని తెలుస్తోంది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా ఏపీఎస్ డియోల్ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ప్రస్తుత వివాదానికి కారణం. ఆయన్ను తొలగించి.. పంజాబ్కు కొత్త అడ్వకేట్ జనరల్(ఏజీ)ను నియమించిన రోజే తాను కాంగ్రెస్ కార్యాలయంలోకి అడుగుపెట్టి, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని సిద్ధూ తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ అదే స్థాయిలో బదులిచ్చారు. ప్రభుత్వ న్యాయ బృందానికి తన మద్దతు ప్రకటించారు.
‘మా న్యాయబృందం నిరసనకారులపై కాల్పులు, మత ఘటనల కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ను విచారించేందుకు అనుమతి పొందింది. అలాగే డ్రగ్స్ కేసులో కూడా మా న్యాయవాదులు కోర్టులో పోరాడుతున్నారు. నవంబర్ 18న వాటికి సంబంధించిన సీల్డ్ నివేదికలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది’ అని చన్నీ స్పష్టం చేశారు. డియోల్ నియామకం విషయంలో చన్నీకి వెనక్కి తగ్గే ఆలోచన లేదని తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.
ప్రస్తుతం రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా ఉన్న సీనియర్ న్యాయవాది ఏపీఎస్ డియోల్ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2015లో అప్పటి అకాలీదళ్ ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై కాల్పులు, మతపరమైన ఘటనలకు సంబంధించిన కేసుల్లో నిందితులైన మాజీ డీజీపీ సుమేధ్ సైనీ, మరో పోలీసు అధికారి తరఫున వాదించిన డియోల్ని ఏజీగా నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ప్రస్తుతం డీజీపీగా ఉన్న సహోతాను కూడా తప్పించాలని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. ఆయన అప్పట్లో ప్రభుత్వం నియమించిన సిట్కు నేతృత్వం వహించారని పేర్కొన్నారు.
కాగా సిద్ధూ ఆరోపణలను ఈ రోజు ఉదయం డియోల్ తప్పుపట్టారు. పదే పదే చేస్తోన్న ఆరోపణలు డ్రగ్స్ కేసు, మత ఘటనల కేసులో న్యాయం జరిగేలా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. సహచరులపై రాజకీయంగా లబ్ధి పొందేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై తిరుగుబాటు
వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. -
తంబళ్లపల్లెలో తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. -
వంద మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. -
ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి
‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
వైకాపాను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు
రాష్ట్రంలో మాదిగలు బాగు పడాలంటే వైయస్ జగన్ను ఓడించి... ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
రెండోరోజు 367 నామినేషన్లు దాఖలు
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
అనకాపల్లి జిల్లాకు చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాకు చేరుకుంది. కాకినాడ జిల్లా తుని మీదుగా పర్యటిస్తూ వచ్చిన ఆయన రాత్రి తొమ్మిది గంటలకు పాయకరావుపేట చేరుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!