Karnataka Politics: నాకు కేబినెట్ హోదా వద్దు..!
తనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రికి మాజీ సీఎం యడియూరప్ప లేఖ
బెంగళూరు: తనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే సదుపాయాలు, భద్రత మాత్రమే తనకు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. సీఎంగా బసవరాజ్ బొమ్మైని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
‘ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సదుపాయాలను మాత్రమే నాకు కల్పించండి. కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోండి’ అని భాజపా సీనియర్ నేత యడియూరప్ప, కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇక, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్ప జులై 26న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం భాజపా అధిష్ఠానం సూచనల మేరకు శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన బసవరాజు బొమ్మై.. జులై 28న నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రికి యడియూరప్పకు కేబినెట్ ర్యాంకు కలిస్తూ శనివారం ఆదేశాలు జారీచేశారు. దీన్ని తిరస్కరించిన యడియూరప్ప.. కొత్త ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇదిలాఉంటే, కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొలువులో అమాత్యులకు ఆశించిన శాఖలు దక్కక పోవడంతో అసమ్మతి స్వరం ప్రతిధ్వనించింది. కేటాయించిన మంత్రి పదవులపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే యడియూరప్ప కూడా ముఖ్యమంత్రికి లేఖ రాయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్