UP Cabinet Expansion: యూపీ మంత్రివర్గంలోకి జితిన్ ప్రసాద
కాంగ్రెస్ పార్టీని వీడి భాజపాలో చేరిన మాజీ కేంద్రమంత్రి జితిన్ ప్రసాదకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో చోటు లభించింది.....
లఖ్నవూ: కాంగ్రెస్ పార్టీని వీడి భాజపాలో చేరిన కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో చోటు లభించింది. మరో ఆరుగురిని సహాయ మంత్రులుగా యూపీ సర్కారు నియమించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణపై చేపట్టింది. అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరించింది. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆధ్వర్యంలో జితిన్ ప్రసాద మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. పల్తూరామ్, ఛత్రపాల్ గంగ్వార్, సంగీత బింద్, ధరమ్వీర్ ప్రజాపతి, సంజీవ్ కుమార్, దినేశ్ ఖతిక్ సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
2017లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇప్పటివరకు మూడుసార్లు కేబినెట్ను విస్తరించారు. 2019 ఆగస్టు 21న మంత్రివర్గ విస్తరణ చేపట్టి కేబినెట్లోకి 23 మంది కొత్త మంత్రులను ఆహ్వానించారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రంతోపాటు రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ సాధించిన (325 సీట్లు) భాజపా.. ఈసారి 350 స్థానాల్లో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మధ్యే జరిగిన పశ్చిమ బెంగాల్లో మెరుగైన ఫలితాలే సాధించింది. ఈ నేపథ్యంలోనే యూపీ ఎన్నికలను కీలకంగా భావిస్తున్న భాజపా.. అన్ని వర్గాల వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.