Mamata Banerjee: అందుకే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశాను: మమతా బెనర్జీ
రోమ్ పర్యటనకు అనుమతి నిరాకరణపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆదివారం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘తమ పర్యటనల విషయంలో చాలా రాష్ట్రాల ప్రతినిధులు అనుమతులు తీసుకోరు. కానీ.. మర్యాద, క్రమశిక్షణ పాటించే క్రమంలో అనుమతులు కోరాను...
కోల్కతా: రోమ్ పర్యటనకు అనుమతి నిరాకరణపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆదివారం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘తమ పర్యటనల విషయంలో చాలా రాష్ట్రాల ప్రతినిధులు అనుమతులు తీసుకోరు. కానీ, మర్యాద, క్రమశిక్షణ పాటించే క్రమంలో అనుమతులు కోరాను. గతంలోనూ షికాగో, కేంబ్రిడ్జ్ తదితర చోట్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇలా ఎన్నింటిని నిలిపివేస్తారు?’ అని ప్రశ్నించారు. ‘బెంగాల్లో వారు ఓడిపోయారు. అయినా తమకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఏజెన్సీలను పంపుతున్నారు. దేశాన్ని అమ్మడమే వారి ఏకైక ఉద్దేశం. భవానీపూర్ ప్రారంభం మాత్రమే’ అని భాజపాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ విషయం గురించి మమత మాట్లాడుతూ.. ‘గతంలో ఈ పార్టీలో ఉన్నప్పుడు సీపీఎంతో పోరాడాం. కానీ, కొన్నాళ్లకు అవి రెండూ పరస్పరం అవగాహన ఏర్పరచుకున్నందున.. బయటకు వచ్చేశాను. వాటి మధ్య అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. కాంగ్రెస్కు భాజపాతోనూ దోస్తీ ఉంది’’ అని మమత ఆరోపించారు. భాజపాను దేశం నుంచి తరిమేస్తామని, వారు గుజరాత్ను పూర్తిగా నాశనం చేశారని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా భాజపాపై మండిపడ్డారు. మోదీ కంటే దీదీ ఎక్కువ పాపులర్ అయినందున.. రోమ్కు వెళ్లనివ్వడం లేదన్నారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆ రాష్ట్రంలో భాజపా.. తాలిబన్ల తరహాలో పాలన చేస్తోందని ఆరోపించారు. అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లేదని, ముఖ్యమంత్రే అన్నీ నిర్ణయిస్తున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీట్ల సర్దుబాటు వేళ.. ఉద్ధవ్ వర్గం, కాంగ్రెస్ మధ్య ‘కిచిడీ’ చిచ్చు
ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం నేతపై కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
మహువా ప్రత్యర్థి రాజమాతకు మోదీ ఫోన్
భాజపా అభ్యర్థి రాజమాత అమృతారాయ్ (Amrita Roy)తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ (Modi).. దేశంలో అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
వైకాపా డంప్లు బట్టబయలైనా చర్యలేవీ?: అచ్చెన్నాయుడు
రేణిగుంట ఎఫ్సీఐ గోదాం వద్ద వైకాపా నేతల నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంప్లు బట్టబయలైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్: కేటీఆర్
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే: చంద్రబాబు
వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. -
వీహెచ్కు బుజ్జగింపులు.. అండగా ఉంటానని సీఎం రేవంత్ భరోసా
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు. -
సీట్ల సర్దుబాటుపై కూటమి చర్చల వేళ.. ఉద్ధవ్ పార్టీ తొలి జాబితా విడుదల
Shiva Sena (UBT): శివసేన (యూబీటీ) పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. -
ఆ కంటెయినర్లో ఏముంది?బ్రెజిల్ సరకా.. మద్యంలో మెక్కిన రూ.వేలకోట్లా?: నారా లోకేశ్
రోజూ తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రశ్నించారు. -
చీరాల వైకాపాలో ముసలం
బాపట్ల జిల్లా చీరాల వైకాపాలో ముసలం రేగింది. స్థానికులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. -
నా ఫోన్నూ ట్యాప్ చేశారు: బండి సంజయ్
గత భారాస ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేయించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సభకు హాజరులో తెదేపా ఎంపీలదే అగ్రస్థానం
లోక్సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. -
జనసేనకు పవన్కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం
జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్.. ఆ పార్టీ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన.. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవీ.రత్నానికి చెక్కు అందజేశారు. -
శింగనమలలో భగ్గుమన్న వైకాపా అసమ్మతి
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు హెచ్చరించారు. -
10 రోజులకే మార్చారు!
వైకాపా 175 శాసనసభా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ప్రకటించిన 10 రోజులకే ముఖ్యమంత్రి జగన్ అందులో మళ్లీ మార్పులు చేశారు. -
బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్తో విజయసాయిరెడ్డికి సంబంధం
మాదకద్రవ్యాలతో బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రైడ్ ఈస్ట్ కంటెయినర్తో విజయసాయిరెడ్డికి కచ్చితంగా సంబంధం ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. -
8 మంది ఎవరో?
లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది. -
మొన్నటివరకు చెట్లు తొలగించారు.. ఇప్పుడు ఇళ్లు పీకేస్తారు
‘ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారంటే మొన్నటివరకు రోడ్డు పక్కనున్న చెట్లు తొలగించారు.. ఆయన హెలికాప్టర్లో తిరిగితే బస్సులు, బడులు చివరకు రోడ్డుపై రాకపోకలూ నిలిపేశారు. -
రేణిగుంట కేంద్రంగా వైకాపా ప్రలోభాల వల
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాష్ట్రవ్యాప్తంగా తాయిలాలు అందిస్తున్న వైకాపా శ్రేణులు అందుకు తిరుపతి జిల్లా రేణిగుంటను కేంద్రంగా ఎంచుకున్నారు. -
వైకాపా పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు
జగన్ పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్సూర్య ధ్వజమెత్తారు. -
3 నెలల్లో తితిదేకు రూ.1,300 కోట్ల కాంట్రాక్టులు
భూమన కరుణాకరరెడ్డి తితిదే ఛైర్మన్ అయిన 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సుమారు రూ.1,300 కోట్ల విలువైన కాంట్రాక్టులను అస్మదీయులకు కట్టబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపికలో అధినేత పవన్కల్యాణ్దే అంతిమ నిర్ణయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్
-
నిరుద్యోగ సమస్యపై ‘సీఈఏ’ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
-
సీట్ల సర్దుబాటు వేళ.. ఉద్ధవ్ వర్గం, కాంగ్రెస్ మధ్య ‘కిచిడీ’ చిచ్చు
-
28 నుంచి టి+0 సెటిల్మెంట్.. తొలుత ఈ 25 షేర్లకే
-
కెప్టెన్సీ ఇచ్చారు సరే.. టైమూ ఇవ్వాలి కదా.. అల్లుడిని వెనకేసుకొచ్చిన షాహిద్ అఫ్రిది
-
మహువా ప్రత్యర్థి రాజమాతకు మోదీ ఫోన్