Punjab politics: సిద్ధూపై ఆరోపణల విషయంలో మౌనం ఎందుకు?
ఒకవైపు పంజాబ్లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ఉత్కంఠ కొనసాగుతుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీపై భాజపా విమర్శలకు దిగింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జోత్ సింగ్ సిద్ధూపై మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన తీవ్ర ఆరోపణల...
కాంగ్రెస్ను ప్రశ్నించిన భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్
దిల్లీ: ఒకవైపు పంజాబ్లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ఉత్కంఠ కొనసాగుతుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీపై భాజపా విమర్శలకు దిగింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జోత్ సింగ్ సిద్ధూపై మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన తీవ్ర ఆరోపణల విషయంలో అధిష్ఠానం ఎందుకు మౌనం వహిస్తోందని భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘సిద్ధూపై అమరీందర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన్ను దేశ ద్రోహిగా పేర్కొన్నారు. ఒకవైపు భారత్పై పాక్ ప్రేరేపిత దాడులు జరుగుతుండగా.. మరోవైపు 2018లో సిద్ధూ ఆ దేశాన్ని సందర్శించి, అక్కడి ఆర్మీ చీఫ్ బజ్వాను కలిసిన విషయం అందరికి తెలిసిందే. కానీ.. నిన్న అమరీందర్ ఇదే అంశంపై ప్రశ్నించారు. ఇది చాలా పెద్ద ఆరోపణ. మరి ఈ అంశంలో పార్టీ అగ్రనేతలు ఎందుకు మౌనంగా ఉన్నారనేదే మా ప్రశ్న’ అని అన్నారు. కాంగ్రెస్.. ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, సిద్ధూపై విచారణ ప్రారంభిస్తుందా? అని సవాల్ విసిరారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన సిద్ధూపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన సీఎం అయితే.. దేశ భద్రతకే ముప్పు అంటూ వ్యాఖ్యానించారు. తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధూ పేరును ప్రతిపాదిస్తే అంగీకరించబోననీ హెచ్చరించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ