T20 World Cup: ఒక్క స్థానం.. మూడు జట్లు

న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌ గెలవాలి..! భారత్‌లో ఇప్పుడు కోట్లాది అభిమానుల ప్రార్థన ఇది. అఫ్గానిస్థాన్‌.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే సెమీస్‌ చేరేందుకు భారత్‌కు మార్గం సుగమం అవుతుంది. అయితే అఫ్గాన్‌ విజయం భారత్‌కు మాత్రమే కాదు.. ఆ జట్టుకు ఎంతో అవసరం. ఎందుకంటే ఆ జట్టూ

Updated : 06 Nov 2021 07:00 IST

న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌ గెలవాలి..! భారత్‌లో ఇప్పుడు కోట్లాది అభిమానుల ప్రార్థన ఇది. అఫ్గానిస్థాన్‌.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే సెమీస్‌ చేరేందుకు భారత్‌కు మార్గం సుగమం అవుతుంది. అయితే అఫ్గాన్‌ విజయం భారత్‌కు మాత్రమే కాదు.. ఆ జట్టుకు ఎంతో అవసరం. ఎందుకంటే ఆ జట్టూ ఇప్పుడు రేసులో ఉంది. గ్రూప్‌- 2 నుంచి పాకిస్థాన్‌ ఇప్పటికే సెమీస్‌ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్‌తో పాటు న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ పోటీపడుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన కివీస్‌.. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాల చొప్పున సాధించిన భారత్‌, అఫ్గానిస్థాన్‌ చెరో 4 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ముందంజ వేసే అవకాశం కివీస్‌కే మెండుగా ఉంది. ఆ జట్టు తన చివరి గ్రూపు మ్యాచ్‌లో ఆదివారం అఫ్గానిస్థాన్‌తో తలపడుతుంది. విజయం సాధిస్తే మిగతా   సమీకరణాలతో సంబంధం లేకుండా న్యూజిలాండ్‌ సెమీస్‌కు వెళ్తుంది.

ఒకవేళ ఆఖరి మ్యాచ్‌లో అఫ్గాన్‌ గెలిస్తే న్యూజిలాండ్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం  కివీస్‌ కంటే అఫ్గాన్‌ రన్‌రేట్‌ మెరుగ్గా  ఉంది. అయితే ఆ జట్టు సెమీస్‌ అవకాశాలు భారత్‌పై ఆధారపడివుంటాయి.

సూపర్‌-12లో ఆఖరి మ్యాచ్‌లో భారత్‌.. నమీబియాను ఎదుర్కోనుంది. కివీస్‌ను అఫ్గాన్‌ ఓడించినా.. ఆ జట్టు రన్‌రేట్‌ పెద్దగా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే అఫ్గాన్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌   కలిగిన భారత్‌ విజయం సాధిస్తే ముందంజ వేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని