INDW vs SLW: శ్రీలంకపై హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టీమ్‌ ఘన విజయం.. సిరీస్‌ సొంతం

శ్రీలంక మహిళలతో జరిగిన రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టీమ్‌ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 174 పరుగుల స్వల్ప...

Published : 04 Jul 2022 18:39 IST

(Photo: BCCI Women Twitter)

పల్లెకెలె: శ్రీలంక మహిళలతో జరిగిన రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టీమ్‌ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండానే ఛేదించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (71; 71 బంతుల్లో 4x4, 1x6), స్మృతి మంధాన (94; 83 బంతుల్లో 11x4, 1x6) నిలకడగా ఆడి 25.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో రెండో వన్డేలోనూ భారత్‌ విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక గురువారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మరోవైపు ఇంతకుముందు భారత మహిళలు టీ20 సిరీస్‌ కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని