Kane Williamson: స్పిన్దే కీలక పాత్ర.. పిచ్ను బట్టి బరిలోకి దించుతాం
టీమ్ఇండియాతో రెండు టెస్టుల సిరీస్కు న్యూజిలాండ్ సన్నద్ధమవుతోంది. గురువారం కాన్పూర్ వేదికగా...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియాతో రెండు టెస్టుల సిరీస్కు న్యూజిలాండ్ సన్నద్ధమవుతోంది. గురువారం (నవంబర్ 25) కాన్పూర్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుతో చేరిపోయాడు. ఈ సిరీస్లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. టెస్టు సిరీస్ కోసం టీ20 ప్రపంచకప్ అనంతరం భారత్తో జరిగిన టీ20 సిరీస్లో ఆడని కేన్ విశ్రాంతి తీసుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో సాధన చేసిన కెప్టెన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడాడు. ‘‘కొత్త బంతిని సీమర్ లేదా స్పిన్నర్ ఎవరికైనా ఇవ్వొచ్చు. బ్యాటర్లపై ప్రభావం చూపేందుకు విభిన్నరీతుల్లో బంతులు విసరాల్సి ఉంటుంది. అంతేకాకుండా టీమ్ఇండియా జట్టులో యువ క్రికెటర్లు ఉన్నారు. కాబట్టి వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మా వరకైతే సిద్ధంగానే ఉన్నాం. మా బౌలింగ్ దళంతో ఎటాక్ చేస్తాం’’ అని వెల్లడించాడు.
భారత్ పర్యటనకు వెళ్లేటప్పుడు పర్యాటక జట్లు ఎక్కువ స్పిన్నర్లను ఎంచుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయా? అనేదానికి విలియమ్సన్ సమాధానం ఇచ్చాడు. ‘‘అనుకూలించడం, సర్దుబాటు చేసుకోవడం కంటే ఆ సమయానికి పిచ్ దేనిమీద ప్రభావవంతంగా ఉంటుందో చూడటం చాలా ముఖ్యమైన అంశమని భావిస్తా. అంతర్జాతీయంగా స్పిన్ విభాగం చాలా పెద్దది. ఆటను ఏ క్షణంలోనైనా మార్చేయగలదు. భారత్, కివీస్ జట్ల రెండూ బలమైన స్పిన్ బౌలింగ్ దళంతో బరిలోకి దిగుతాయని అనుకుంటున్నా. మా జట్టు సన్నద్ధత చాలా బాగుంది. టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే సిరీస్లో మేము ఫేవరేట్లుగా కాకుండా మా ఆటను ఆడతాం. ఎందుకంటే టీమ్ఇండియా జట్టులోని బ్యాటింగ్, బౌలింగ్ డెప్త్ చాలా ఎక్కువ. గత కొన్నేళ్లుగా చూస్తునే ఉన్నాం. స్వదేశంలోని పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంది. అసలైన సవాల్ ఉందని మాత్రం భావిస్తున్నాం’’ అని కేన్ పేర్కొన్నాడు.
స్పిన్కు అనుకూలించే భారత మైదానాల్లో ఇరు జట్లు ముగ్గురేసి స్పిన్నర్లతో బరిలోకి దిగుతాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ కూడా ఇదే మాట చెప్పాడు. అయితే పిచ్ పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు. కివీస్కు సాంట్నర్, రచిన్ రవింద్ర, అజాజ్ పటేల్, విల్ యంగ్ , విల్ సోమర్విల్లేతో కూడిన స్పిన్ దళం ఉంది. టీమ్ఇండియా వైపు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకంలో ఆడబోయే తొలి టెస్టుకు అజింక్య రహానె సారథిగా వ్యవహరిస్తుండగా.. పుజారా వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. మరి తొలి టెస్టు పిచ్ దేనికి సహకరిస్తుందో... తుది జట్టులో ఎవరు ఉంటారో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే..
మొన్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన టీమ్ఇండియా ముఖాముఖిగా తలపడిన సిరీసుల్లో మాత్రం ఆధిక్యత ప్రదర్శించింది. ఇప్పటి వరకు టెస్టుల్లో న్యూజిలాండ్, భారత్ జట్లు ముఖాముఖిగా 24 టెస్టు సిరీసుల్లో తలపడగా.. టీమ్ఇండియా 13 సిరీస్లు, న్యూజిలాండ్లు 8 సిరీస్లను కైవసం చేసుకున్నాయి. మరో మూడు సిరీస్లు డ్రాగా ముగిశాయి. 1955లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా.. 2021లో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కివీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మరి ఈ సిరీస్ను కూడా గెలుచుకుని ఆధిక్యతను నిలబెట్టుకోవాలని, డబ్ల్యూటీసీ ఫైనల్కు ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా