Dhoni: ఇప్పటికీ నా దగ్గర ధోనీ నంబర్ లేదు: రవిశాస్త్రి
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని అన్నాడు...
సచిన్కైనా అప్పుడప్పుడు కోపం వస్తుంది కానీ..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని అన్నాడు. ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, ఎప్పుడూ కోపంగా చూడలేదని చెప్పాడు. తాజాగా పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన శాస్త్రి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. ‘మహీ డకౌటైనా.. శతకం సాధించినా.. ప్రపంచకప్ గెలిచినా.. తొలి రౌండ్లోనే జట్టు వెనుదిరిగినా ఒకేలా ఉంటాడు. నేనెంతో మందిని చూశాను. కానీ, ధోనీ లాంటి ఆటగాడిని చూడలేదు. ఒక్కోసారి సచిన్కు కూడా టెంపర్మెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు కోపం వస్తుంది. కానీ, ధోనీకి మాత్రం ఎప్పుడూ రాదు’ అని శాస్త్రి వివరించాడు.
‘మహీ ఫోన్ వాడొద్దనుకుంటే అలాగే ఉండగలడు. తాను గ్యాడ్జెట్ పక్కన పెట్టాలనుకుంటే అలాగే పెట్టేస్తాడు. ఇప్పటికీ నా వద్ద అతడి ఫోన్ నంబర్ లేదంటేనే అర్థం చేసుకోవచ్చు. నేనెప్పుడూ తన నంబర్ కూడా అడగలేదు. తను అసలు ఫోన్ దగ్గర పెట్టుకోడని నాకు తెలుసు. అతడిని సంప్రదించాలనుకుంటే ఎలా కనెక్ట్ అవ్వొచ్చో నాకు తెలుసు. ధోనీ చాలా ప్రత్యేకమైన ఆటగాడు’ అని మాజీ కోచ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అలాగే విరాట్పై స్పందించిన అతడు.. కోహ్లీ మైదానంలో దిగితే గెలుపే లక్ష్యంగా ఆడతాడని, అక్కడ దేనీ గురించీ పట్టించుకోడని అన్నాడు. ఇక మైదానం బయట మాత్రం పూర్తి భిన్నంగా.. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని తెలిపాడు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అతడు కొద్ది నెలలు విరామం తీసుకొని తిరిగి జట్టుకు ఆడితే మంచి ఫలితాలు ఉంటాయన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం