IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్పై రికీ పాంటింగ్ జోస్యం
ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కున్న క్రేజే వేరు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కున్న క్రేజే వేరు. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. గతేడాది టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. మళ్లీ ఇప్పుడు యూఏఈ వేదికగా ఆసియాకప్లో ఈ నెల 28న ఇండో-పాక్ సమరం జరగనుంది. ఇరు జట్లు సూపర్ ఫామ్లో ఉండటంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు సహజం. దీంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అనే చర్చ మొదలైంది. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ఈ మ్యాచ్ విజేత ఎవరనేది జోస్యం చెప్పాడు.
పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎసిసోడ్లో మాట్లాడుతూ ‘ఏ టోర్నమెంట్లోనైనా టీమ్ఇండియా కఠిన ప్రత్యర్థే. ఇతర జట్లతో పోలిస్తే భారత్కు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్లో డెప్త్ ఉంది. ఇది ఆ జట్టుకి కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక ఆసియాకప్లో విజేత ఎవరంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో పాక్పై భారత్ ఆధిపత్యం చలాయిస్తే.. ఆసియా కప్లో మాత్రం ఇరుజట్లు 13 సార్లు తలపడితే.. భారత్ ఏడు గెలిస్తే.. పాకిస్తాన్ ఐదు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. కాబట్టి టోర్నీలో హోరాహోరీ పోరును అభిమానులు చూడొచ్చు. అయితే, నా దృష్టిలో మాత్రం భారత్ ఫెవరెట్గా కనిపిస్తోంది. నా ఓటు టీమిండియాకే.. ఆసియా కప్ కూడా టీమ్ఇండియానే గెలుస్తుందని నేను భావిస్తున్నాను. అయితే, పాక్ జట్టును అంత తేలికగా తీసేయడానికి లేదు. ఆ జట్టు ఈ మధ్య కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. నాణ్యమైన ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు సూపర్స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి పాక్తో టీమ్ఇండియాకు ప్రమాదం ఉంది’ అని రికీ విశ్లేషించాడు.
‘ఇంకో 15-20 ఏళ్లయినా సరే.. భారత్, పాక్ మ్యాచ్కున్న క్రేజ్ తగ్గదు. ఒక క్రికెట్ ప్రేమికుడిగా, పరిశీలకుడిగా ఇటువంటి మ్యాచులను చూస్తే ఆనందంగా ఉంటుంది. క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగానే చూస్తారు. కానీ యాషెస్ లాంటి టెస్టు సిరీస్కు మాత్రమే ఇది పరిమితం. అదే భారత్, పాక్ మధ్య ఉన్న ఆధిపత్య దోరణి అలా ఉండదు. ఏ ఫార్మాట్లోనైనా ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తిని పుట్టిస్తుంది’ అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక భారత్, పాక్ టెస్టు క్రికెట్లో తలపడితే చూడాలని ఉందని.. అసలు మజా టెస్టుల్లోనే ఉంటుందని పాంటింగ్ చెప్పాడు. టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్లు చివరిసారిగా 2007 బెంగుళూరు టెస్టులో ఆడాయి. అయితే, వచ్చే ఏడాది జరగనున్న టెస్టు ఛాంపియన్ షిప్లో ఈ రెండు జట్లు ఫైనల్కు వెళ్తే అభిమానులు సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఆసక్తికర పోరు చూసే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.