IPL 2021: రాజస్థాన్పై హైదరాబాద్ విజయం
రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.
దుబాయ్: ఈ సీజన్లో ఎట్టకేలకు హైదరాబాద్ రెండో విజయం సాధించింది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. రాజస్థాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని విలియమ్సన్ సేన 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్ జట్టులో జేసన్ రాయ్(60: 42 బంతుల్లో 8X4, 1x6), కెప్టెన్ విలియమ్సన్ (51 నాటౌట్: 41 బంతుల్లో 5X4, 1X6) అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో హైదరాబాద్కు వరుస ఓటముల నుంచి స్వాంతన లభించినట్టైంది. అంతకుముందు రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (82: 57 బంతుల్లో 7x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, జైశ్వాల్(36) రాణించాడు. అర్ధసెంచరీతో చెలరేగి హైదరాబాద్కు విజయాన్ని అందించిన జేసన్రాయ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
జేసన్ దూకుడు..
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్కు ఓపెన్లరు శుభారంభం అందించారు. జేసన్రాయ్, వృద్ధి సాహా తొలి వికెట్కు 57 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మంచి ఊపు మీద ఉన్న ఈ జోడిని లామ్రోర్ విడగొట్టాడు. అతడు వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి వృద్ధిమాన్ సాహా స్టంపౌట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్తో జేసన్రాయ్ జట్టుకట్టాడు. వీలుచిక్కినప్పడల్లా బౌండరీలతో జేసన్ (60) దూకుడు పెంచాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఈ జోడి 90 పరుగులు చేసి విజయం దిశగా సాగింది. ఈ క్రమంలో జేసన్ రాయ్ జట్టు స్కోర్ 114 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన ప్రియమ్ గార్గ్(0) డకౌట్ కావడంతో హైదరాబాద్ శిబిరంలో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే కెప్టెన్ విలియమ్సన్ క్రీజులో ఉండడంతో విజయంపై ఆ జట్టు భరోసాగానే కనిపించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ(21 నాటౌట్)తో కలిసి విలియమ్సన్ స్కోర్ను ముందుకు తీసుకెళ్లాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ విజయతీరాల వైపు తీసుకెళ్లాడు. ఇక 18 ఓవర్లలో 16 పరుగులు రావడంతో ఎస్ఆర్హెచ్ విజయం లాంఛనం అయింది. చివర్లో విలియమ్సన్ వరుసగా రెండో ఫోర్లు కొట్టడంతో జట్టు విజయంతో పాటు అర్ధశతకం కూడా నమోదు చేశాడు. రాజస్థాన్ జట్టులో ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహిపాల్ లామ్రోర్, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు.
సంజూ శాంసన్ ఒంటరి పోరాటం..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 11 పరుగుల వద్ద లెవిస్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన సంజూ శాంసన్ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (36)తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అయితే జైశ్వాల్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన లివింగ్స్టోన్ (4) ఎక్కువసేపు నిలబడలేదు. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసిన రాజస్థాన్ను మహిపాల్ లామ్రోర్ (29)తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో సంజూతోపాటు పరాగ్ పెవిలియన్కు చేరడంతో రాజస్థాన్ 164 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2.. సందీప్ శర్మ, భువనేశ్వర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు