IND vs SA : దక్షిణాఫ్రికా గడ్డ మీద భువి చెత్త రికార్డు.. మూడో వన్డేకు భారీ మార్పులు?
వికెట్కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలిగే భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్..
ఇంటర్నెట్ డెస్క్: వికెట్కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగలిగే భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ కొంతకాలంగా విఫలమవుతున్నాడు. 2019 వరల్డ్ కప్ నుంచి పవర్ప్లేలో 41 ఓవర్లు వేసిన భువనేశ్వర్ తీసిన వికెట్లు మూడంటే మూడే. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ విఫలమవుతున్న భువి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. స్లోగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్ల మీద వికెట్ల కోసం భువి చాలా శ్రమించాడు. అయితే ఈ సిరీస్లో ఆడిన రెండు వన్డేల్లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టకపోవడం గమనార్హం. మొత్తం 18 ఓవర్లు వేసిన భువి (64, 67) 7.27 ఎకానమీతో 131 పరుగులను సమర్పించుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన గత ఐదు వన్డేల గణాంకాలను పరిశీలిస్తే భువి ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. 36 ఓవర్లు వేసినా వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. 6.72 ఎకానమీతో 272 పరుగులు ఇచ్చాడు. దక్షిణాఫ్రికా పిచ్ల మీద భువనేశ్వర్ బౌలింగ్ యావరేజీ 200కిపైగా ఉంది. ఏ దేశం మీదనైనా సరే అత్యంత పేలవమైన ప్రదర్శన చేసిన మూడో భారత బౌలర్ భువీనే. టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఎస్ వెంకటరాఘవన్ (275) ఇంగ్లాండ్పై తొలి స్థానంలో ఉండగా.. యూఏఈలో రాబిన్ సింగ్ (207) రెండో స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్ దక్షిణాఫ్రికాలో మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడాడు. దాదాపు 60 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టి 400 పరుగులను సమర్పించుకోవడం గమనార్హం.
వారిని పక్కన పెడతారా?
నామమాత్రమైన మూడో వన్డేలో గెలిచి కాస్త పరువుతో ఇంటిముఖం పట్టాలని టీమ్ఇండియా భావిస్తోంది. బౌలింగ్లో విఫలమవుతున్న భువనేశ్వర్ను తొలగించి రిజర్వ్ బెంచ్పై ఉన్న సిరాజ్ లేదా ప్రసిధ్లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్లోనూ మార్పులు చేయాలని టీమ్ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ను తీసుకునే వెసులుబాటు భారత్కు ఉంది. ఇక బుమ్రాకీ, భువనేశ్వర్ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మూడో వన్డేకు టీమ్ఇండియా జట్టు ఇలా ఉండొచ్చని ఓ అంచనా..
భారత్: కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రుతురాజ్, రిషభ్ పంత్, సూర్యకుమార్, శార్దూల్, అశ్విన్, దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ/సిరాజ్, చాహల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!