AB devilliers: ఆర్సీబీకి బిగ్ షాక్.. క్రికెట్కు పూర్తిగా వీడ్కోలు పలికిన డివిలియర్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టుకు గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా మొత్తం ఆటకే వీడ్కోలు పలికాడు...
ఇంటర్నెట్డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టుకు గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా మొత్తం ఆటకే వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విటర్లో వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తనకు అవకాశం కల్పించిన అన్ని జట్లకూ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇన్నేళ్లు క్రికెటర్గా కొనసాగడం అద్భుతమైన ప్రయాణమని, కానీ.. ఇప్పుడు ఆటకు మొత్తానికే వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపాడు. దీంతో వచ్చే మెగా ఐపీఎల్ సీజన్లో డివిలియర్స్ ఆర్సీబీలోనే కాకుండా ఏ జట్టులోనూ ఆడడనే విషయం అర్థమైంది.
‘నేను చిన్నప్పుడు మా సోదరులతో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఆటను ఎంతగానో ఆస్వాదించాను. ఇప్పుడు 37 ఏళ్ల వయసులో అలాంటి కసిలేదు. ఈ ఆట నాకెంతో ఇచ్చింది. టైటాన్స్, దక్షిణాఫ్రికా, ఆర్సీబీ ఇలా ఏ జట్టు తరఫున ఆడినా నాకు చాలా మంచి అవకాశాలు కల్పించింది. దీనికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా నాతో కలిసి పనిచేసిన, ఆడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. నేను ఎక్కడ ఆడినా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, భారత్లో విశేష గుర్తింపు దక్కింది. చివరగా నా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం లేకపోతే ఇంతటి విజయం సాధ్యం కాదు. ఇకపై నా జీవితంలో మరో అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటా’ అని డివిలియర్స్ ట్వీట్లు చేశాడు.
ఒక శకం ముగిసింది: ఆర్సీబీ
మరోవైపు డివిలియర్స్ నిర్ణయంపై ఆర్సీబీ ఫ్రాంఛైజీ విచారం వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లు ఆ జట్టుతో కలిసి ఆడిన అతడు బెంగళూరు ఫ్రాంఛైజీలో కోహ్లీ తర్వాత అతికీలకమైన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ ఈ విధంగా స్పందించింది. ‘ఒక శకం ముగిసింది. నీలాంటి క్రికెటర్ మరొకరు లేరు. ఏబీ.. ఆర్సీబీలో లేకపోతే మేం కచ్చితంగా నిన్ను మిస్ అవుతాం. మా జట్టును, అభిమానులను, క్రికెట్ ప్రేమికులను నువ్వు ఎంతగా అలరించావో అందరికీ తెలుసు. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. హ్యాపీ రిటైర్మెంట్ లెజెండ్’ అని భావోద్వేగ భరితంగా స్పందించింది.
నేనిప్పుడు హాఫ్ ఇండియన్: ఏబీడీ
ఇక ఆర్సీబీ పోస్టు చేసిన మరో వీడియోలో డివిలియర్స్ మాట్లాడుతూ.. నేను ఎప్పటికీ ఆర్సీబీ అభిమానిగానే ఉంటా. ఈ జట్టులోని ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే. ఆటగాళ్లు వస్తారు. వెళతారు. కానీ, ఇక్కడుండే ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇప్పుడు నేను హాఫ్ఇండియన్ అయిపోయాను. అందుకు గర్వంగా ఉంది’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్