Team India: రోహిత్, రాహుల్, పంత్ కాకుండా తెరపైకి కొత్త కెప్టెన్ పేరు
ఈ పొట్టి ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ టీమ్ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ఇంతకుముందే వెల్లడించడంతో తర్వాతి సారథి ఎవరనే విషయం ఆసక్తిగా మారింది...
ఇంటర్నెట్డెస్క్: ఈ పొట్టి ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ టీమ్ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ఇంతకుముందే వెల్లడించడంతో తర్వాతి సారథి ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. ఈ ప్రపంచకప్ తర్వాత భారత్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు ఎవరు జట్టును నడిపిస్తారనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
కెప్టెన్సీ రేసులో ఇప్పటికే రోహిత్, రాహుల్, రిషభ్ పంత్ పేర్లు ప్రచారంలో ఉండగా తాజాగా మరో ఆటగాడి పేరు తెరపైకి వచ్చింది. మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ఈ విషయంపై ఓ క్రీడాఛానల్తో మాట్లాడుతూ జస్ప్రిత్ బుమ్రా పేరును సూచించాడు. అతడు ఇప్పుడు జట్టులో కీలక ఆటగాడని, పరిస్థితులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటాడని చెప్పాడు. అలాగే అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడని గుర్తుచేశాడు. ‘రోహిత్ కాకుండా మనం పంత్, రాహుల్ పేర్లు కూడా వింటున్నాం. పంత్ టీమ్ఇండియాతో అన్ని దేశాలు తిరిగొచ్చాడు. కొన్నిసార్లు జట్టు నుంచి కూడా వైదొలిగాడు. మరోవైపు టెస్టుల్లో మయాంక్ గాయపడ్డాక రాహుల్ను తీసుకున్నారు. అయితే, బుమ్రా కూడా ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. అతడు అన్ని ఫార్మాట్లలో తుది జట్టులో ఉంటున్నాడు. కెప్టెన్సీకి అర్హుడే. పేసర్లు కెప్టెన్సీ చేయొద్దని ఎక్కడా రాసిపెట్టలేదు’ అని నెహ్రా తన అభిప్రాయం పంచుకున్నాడు.
ఇదిలా ఉండగా వచ్చే వారమే టీమ్ఇండియా టీ20 కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ వెల్లడించే అవకాశం ఉంది. ఈనెలలో న్యూజిలాండ్తో క్రికెట్ మ్యాచ్లు ఉన్నందున అంతకుముందే ఈ విషయంపై స్పష్టతనిస్తుందని సమాచారం. వచ్చే వారం ప్రపంచకప్ టోర్నీ ముగియనున్న నేపథ్యంలో ఆ సమయంలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఈ టోర్నీలో భారత్ ప్రస్తుతం గ్రూప్-2లో రెండు విజయాలతో 4 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అఫ్గాన్, స్కాట్లాండ్లపై గెలిచిన కోహ్లీసేన అంతకుముందు పాక్, న్యూజిలాండ్తో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈరోజు అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ను ఓడిస్తే టీమ్ఇండియా సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.