IND vs NZ: నా ఫామ్ గురించి ఆందోళన లేదు: రహానె
మరికాసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్లు కాన్పూర్ వేదికగా తొలి టెస్టు ఆడనున్నాయి. అంతకుముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు...
ఇంటర్నెట్డెస్క్: కాన్పూర్ వేదికగా మరికాసేపట్లో భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో రహానె జట్టు పగ్గాలు అందుకున్నాడు. అయితే, ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న అతడు.. ఆ విషయం గురించి ఆందోళన లేదన్నాడు. తొలి టెస్టు నేపథ్యంలో రహానె, న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘నా ఫామ్ గురించి ఆందోళన లేదు. వీలైనంత వరకూ జట్టుకు సాయపడటమే నా పని. ప్రతి ఇన్నింగ్స్లో వంద చేయడమే సహకరించినట్టు కాదు. ఇన్నింగ్స్లో 40, 50 పరుగులు చొప్పున చేసినా ముఖ్యమే. భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు. మ్యాచ్పైనే దృష్టి పెట్టా. స్పిన్కు సహకరించే పిచ్లపై ఆడడం భారత బ్యాటర్లకూ సవాలే. ఫామ్లో ఉన్న రాహుల్ గాయపడడం మా జట్టుకు ఎదురు దెబ్బే. అయినా అతడిని భర్తీ చేసే ఆటగాళ్లున్నారు. శ్రేయస్ టెస్టు అరంగేట్రం చేస్తాడు. జట్టు కూర్పుపై ఇప్పుడే ఏమీ చెప్పలేను’ అని రహానె చెప్పుకొచ్చాడు.
ఇక విలియమ్సన్ మాట్లాడుతూ.. ‘మొత్తం సిరీస్లో స్పిన్ నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. భారత్లో ఎన్నో జట్లు ఇలాంటి సవాళ్లు ఎదుర్కున్నాయి. మా అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. మా బౌలింగ్ బృందంలో స్పిన్నర్లు అజాజ్, సోమర్విల్లె ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు కీలకం కానున్నారు. భారత స్పిన్నర్ల బలం మాకు తెలుసు. వాళ్ల బౌలింగ్లో పరుగులు చేసేందుకు విభిన్నమైన మార్గాలు అన్వేషించాల్సి ఉంది. కీలక ఆటగాళ్లు లేకున్నా టీమ్ఇండియాను తక్కువగా చూడలేం’ అని అభిప్రాయపడ్డాడు.
ఈ పిచ్ ఎలా ఉండనుందనే విషయంపై క్యూరేటర్ శివ్కుమార్ వివరణ ఇచ్చారు. ‘స్పిన్ పిచ్ రూపొందించాలని బీసీసీఐ నుంచి లేదా జట్టు మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సూచనలు అందలేదు. ఓ మంచి పిచ్కు సంబంధించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశా. ఈ కాలంలో సాధారణంగానే గాలిలో తేమ ఉంటుంది. ఈ పిచ్ త్వరగా పగుళ్లు రాదని చెప్పగలను. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగుస్తుందని అనుకోవడం లేదు. రెండో రోజు నుంచి బంతి తిరిగే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు.
Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’