IPL 2021: చెన్నై గెలవాలంటే ఆ ‘12 ఓవర్లే’ కీలకం
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఒక టోర్నీని రెండు అంచెలుగా నిర్వహించారు. ఎట్టకేలకు అన్ని మ్యాచ్లు పూర్తి చేసుకొని రెండు జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి...
ఫైనల్స్లో కోల్కతా స్పిన్ త్రయాన్ని ఎదుర్కోగలదా?
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఒక టోర్నీని రెండు అంచెలుగా నిర్వహించారు. ఎట్టకేలకు అన్ని మ్యాచ్లు పూర్తి చేసుకొని రెండు జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. అవే చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్. ప్లేఆఫ్స్ వరకూ ఫేవరెట్ జట్లుగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ అనూహ్యంగా కోల్కతా చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీంతో కోల్కతా ఫైనల్స్లో చెన్నైతో తలపడేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం స్పిన్ బౌలింగ్తో బలంగా ఉన్న ఆ జట్టును ధోనీసేన తుదిపోరులో ఓడించాలంటే తన అమ్ములపొదిలో ఉన్న అన్ని అస్త్రాలను సంధించాల్సిందే. ముఖ్యంగా కోల్కతా స్పిన్నర్లను ఎదుర్కోవడమే ఆ జట్టు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం.
బెంగళూరు, దిల్లీని కట్టడి చేసింది ఆ ముగ్గురే..
లీగ్ దశలో 10 విజయాలతో దిల్లీ.. 9 విజయాలతో బెంగళూరు ముందే ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో స్థానం కోసం నాలుగు జట్లతో పోటీపడిన కోల్కతా, ముంబయితో సమానంగా ఏడు విజయాలతో నిలిచినా... రన్రేట్ పరంగా మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఇక్కడ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బెంగళూరు, దిల్లీ జట్లను ఓడించింది. ఏమాత్రం ఆశలు లేని పరిస్థితుల నుంచి ఫైనల్లో చెన్నై లాంటి మేటి జట్టును ఢీకొట్టే దాకా ఆ జట్టు ప్రస్థానం కొనసాగింది. అందుకు ప్రధాన కారణం వరుణ్ చక్రవర్తి, షకిబ్ అల్ హసన్, సునీల్ నరైన్ లాంటి స్పిన్నర్లు.
వావ్ అనిపించే ఎకానమీ..
షార్జా వేదికగా జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్లో సునీల్ నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును భారీ దెబ్బకొట్టాడు. తొలుత బౌలింగ్తో నాలుగు కీలక వికెట్లు తీసిన అతడు తర్వాత బ్యాటింగ్లో 26 పరుగులు చేశాడు. దీంతో రెండు ఇన్నింగ్స్ల్లో కోహ్లీసేన విజయావశాలకు గండికొట్టాడు. అతడికి తోడు వరుణ్, షకిబ్ కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరు భారీ స్కోర్ చేయకుండా 138/7 పరుగులకే కట్టడి చేశారు. ఇక దిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ ఈ ముగ్గురే మరోసారి కోల్కతాను ఆదుకున్నారు. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. 12 ఓవర్లకు 71/2తో ఉన్న దిల్లీ.. చివరికి 135/5 స్కోరే చేసింది. ఈ రెండు మ్యాచ్ల్లో వరుణ్ (6.40), షకిబ్ (6.64), నరైన్ (6.44) ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఈ గణాంకాలే కోల్కతా బౌలింగ్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్స్లో చెన్నై రాణించాలంటే ఈ ముగ్గుర్ని ఎదుర్కోవడమే కీలకంగా మారింది. వీరిని ధాటిగా ఆడితే చెన్నైకు తిరుగు ఉండదనే చెప్పాలి.
‘తలా’ ఓ చేయి వేస్తేనే..
గతేడాది పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మేటి ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. అందులో ఓపెనర్లు రుతురాజ్ (603), ఫా డుప్లెసిస్ (547) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ జట్టుకు విలువైన భాగస్వామ్యాలు జోడించారు. అనంతరం మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, కెప్టెన్ ధోనీ, రాబిన్ ఉతప్ప ఇలా సందర్భోచితంగా రాణించి జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషించారు. అయితే, ఈ జట్టు సాధించే స్కోర్లలో ఓపెనర్లే అధిక భాగం పని పూర్తి చేస్తున్నారు. ఒకవేళ ఫైనల్లో వీరు విఫలమైతే ధోనీసేనలో తలో చేయి వేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం కోల్కతా స్పిన్నర్లు బలంగా కనిపిస్తుండటంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే 2012లో భారీ స్కోర్ సాధించినా చెన్నై.. కోల్కతా చేతిలో ఓటమిపాలైన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ చెన్నై బ్యాట్స్మెన్లో ఏ ముగ్గురు చెలరేగినా కేకేఆర్పై ఆధిపత్యం చెలాయించే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు రుతురాజ్ బాగా ఆడుతున్నా ఫైనల్స్లో చెలరేగడమే ముఖ్యంగా మారనుంది. అతడు ఇంకో 24 పరుగులు సాధిస్తే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఆరెంజ్ క్యాప్ అందుకునే వీలుంది. ప్రస్తుతం ఈ జాబితాలో కేఎల్ రాహుల్ (626) అందరి కన్నా ముందున్నాడు.
ధోనీ అనుభవమే కీలకం..
ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీకి మించిన ఆటగాడు లేడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకు అతడు సాధించిన విజయాలే ఉదాహరణ. మరోవైపు దిల్లీతో జరిగిన క్వాలిఫయర్-1లో ధోనీ (18*; 6 బంతుల్లో 3x4, 1x6) చివర్లో దంచికొట్టి జట్టును విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అతడు కూడా ఫామ్లోకి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అలా కోల్కతాపై ఫైనల్స్లోనూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడితే చెన్నైకి ఎదురుండదు. తన అనుభవన్నంతా ఉపయోగించి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ను నాలుగోసారి విజేతగా నిలబెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్కతా బౌలర్లను ఎదుర్కోవడమే ఆ జట్టు విజయాలపై ఆధారపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ